తెలుగు సినిమాలకు ‘గుడ్ బై’ చెప్పేసిన Shruti Haasan ..కారణం అదేనా!

- Advertisement -

Shruti Haasan భారత దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ, క్రేజ్ మరియు డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు శృతి హాసన్.కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా, తనకంటూ ఒక గుర్తింపుని దక్కించుకొని, నేడు సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది.రీసెంట్ గా ఈమె పట్టిందల్లా బంగారం అయిపోతుంది.ముఖ్యంగా తెలుగు లో ఈమె రీసెంట్ గా చేసిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అందరికీ తెలిసిందే.

Shruti Haasan
Shruti Haasan

ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదలైనా కూడా సూపర్ హిట్ అయ్యాయి.అంతకు ముందు కూడా ఈమె చేసిన క్రాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.అలా ఈమె అడుగుపెట్టిన తెలుగు ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి.అలాంటి లక్కీ హ్యాండ్ ఇక టాలీవుడ్ ని వీడబోతుందా?.

Shruti

ఇకపై ఆమెని తెలుగు సినిమాల్లో చూడలేమా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం తమిళం మరియు హిందీ బాషలలో ఫుల్ బిజీ గా గడుపుతున్న శృతి హాసన్, తెలుగు చిత్రాలకు నో చెప్తుందట.ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదనే ఉందని, ఇప్పట్లో తెలుగు సినిమా చేసే ఆలోచన లేనట్లు ఆమె వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి చెప్పి వెనక్కి పంపేస్తుందట.వరుస విజయాలు వస్తున్నా కూడా శృతి హాసన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని, ఆమె అభిమానులు వాపోతున్నారు.

- Advertisement -
hasan

కానీ కారణం మాత్రం తెలియడం లేదు.ఇటీవలే ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో తన పాత్ర ని పూర్తి చేసుకున్న శృతి హాసన్, హిందీ లో పలు వెబ్ సిరీస్ లు చెయ్యడానికి సంతకం చేసింది.సలార్ వంటి పెద్ద ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేసినందుకు గాను ఆమె అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.పాన్ ఇండియా రేంజ్ లో సరైన హిట్టు లేని శృతి హాసన్ కి,ఈ సినిమా ద్వారా పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు లభిస్తుందని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here