Pushpa 2 : పుష్ప 2 సినిమాతో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన శ్రేయ.. టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ ఉమెన్

- Advertisement -

Pushpa 2 : ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది శ్రేయ ఘోషల్. దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న పుష్ప 2లో ఓ సాంగ్ తో ఆమె తాజాగా ఓ క్రేజీ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి మరో పాట విడుదల కానుంది. అది ఫిమేల్ ఓరియెంటెడ్ సాంగ్ అని ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోతో అర్థం అయింది. అయితే దీనికి సంబంధించిన వీడియో రష్మిక స్వయంగా విడుదల చేసింది.

ఇప్పుడు ఆ సాంగ్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. పుష్పా 2 నుండి త్వరలో రాబోతున్న ఈ సెకండ్ పాటకు.. శ్రేయ ఘోషల్ గాత్రం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట మొత్తం ఆరు భాషల్లో శ్రేయ ఘోషల్‌ పాడారు. ఇలా ఒకే పాటను ఇప్పటి వరకు ఐదుకు పైగా భాషల్లో పాడిన వ్యక్తుల్లో బాలసుబ్రమణ్యం, శంకర్ మహదేవన్ ఉన్నారు. వారి తర్వాత శ్రేయ ఘోషల్ పేరు ప్రస్తుతం వినిపిస్తుంది. ఇప్పటివరకు ఏ ఫిమేల్ సింగర్ కూడా ఇలాంటి అవకాశాన్ని అందుకోలేదు.

- Advertisement -

ఫస్ట్ టైం శ్రేయ ఘోషల్ ఒకే పాటను ఆరు భాషల్లో పాడి రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఈ పాటను ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆమె పాడింది. దీంతో అరుదైన రికార్డ్ సృష్టించింది. 29వ తేదీన 11 గంటలకు ఈ పాటను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here