Bigg Boss Telugu : అమర్ దీప్ ని టార్గెట్ చేస్తున్న శోభా శెట్టి మరియు ప్రియాంకా.. పాపం స్నేహితులే ఇలా మోసం చేస్తున్నారేంటి!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ అమర్ దీప్ పై టార్గెట్ చేస్తున్నారని చాలా మందికి అనిపించింది. ముందుగా శివాజీ మరియు అతని గ్యాంగ్ అమర్ పై ఒక రేంజ్ లో టార్గెట్ చేసారు. వీళ్ళు కాళీగా కూర్చున్న సమయం లో 90 శాతం వరకు అమర్ దీప్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడం మనం ఎన్నో సార్లు గమనించాము.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ముఖ్యంగా అమర్ దీప్ శివాజీ పై ఎంత ప్రేమ చూపిస్తాడు, కానీ శివాజీ మాత్రం తిరిగి అమర్ పై ద్వేషాన్ని పంచాడు. కేవలం ఈ ఎలిమెంట్ వల్లే అమర్ దీప్ ఇప్పుడు టైటిల్ విన్నింగ్ అయ్యే రేంజ్ ఓటింగ్ ని దక్కించుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా అమర్ దీప్ కి మొదటి నుండి ఎంతో సహాయం గా , స్నేహం గా ఉంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ప్రియాంక మరియు శోభా శెట్టి.

Amardeep

రతికా ని కూడా అమర్ దీప్ తన బెస్ట్ ఫ్రెండ్ అనుకోని ఆమె కోసం చాలా చేసాడు కానీ, గత వారం ఆమె అమర్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేసిందో అందరూ చూసారు. ఇక ప్రియాంక అయితే తన కాబొయ్యే భర్త శివ కుమార్ రాకముందు ఒకలాగా, అతను వచ్చి వెళ్లిన తర్వాత ఒకలాగా అమర్ తో ప్రవర్తిస్తుంది. ఇది ఈమధ్య మనం గమనిస్తూనే ఉన్నాం.

- Advertisement -
Priyanka amardeep

ఇక హౌస్ లో అమర్ దీప్ కి ఇప్పుడు ప్రశాంత్ మంచి స్నేహితుడు అయ్యాడు, కానీ శోభా శెట్టి మాత్రం అమర్ కి దూరం గా జరిగే ప్రయత్నం చేస్తుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఎందుకంటే నిన్న ఫన్ టాస్క్ ని చూస్తే అదే అనిపించింది. సరదాగా జరిగిపోతున్న టాస్క్ లో కూడా శోభా శెట్టి అమర్ దీప్ ని టార్గెట్ చేసి, అతన్ని ఫైర్ అయ్యేలా చేసింది. ఇలా హౌస్ మేట్స్ అందరూ అమర్ ని టార్గెట్ చెయ్యడం వల్లే, అతని గ్రాఫ్ ఆ రేంజ్ లో పెరిగింది అని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here