Samantha : US నుంచి రాగానే సమంత ఆ సినిమాలో నటిస్తుందట.. భలే ప్లాన్ చేసిందిగా..?

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందనే విషయం తెలిసిందే. ఇటీవలే ఖుషీ సినిమా షూటింగ్, సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భామ ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం ఈ బ్యూటీ త్వరలోనే అమెరికా వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్. అయితే యూఎస్​కు వెళ్లే ముందు సామ్.. దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని పలు ఆలయాలను దర్శించుకుంది. తాజాగా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్​కు వెళ్లి అక్కడ సద్గురు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమంలో పాల్గొంది.

Samantha
Samantha

అయితే ఆధ్యాత్మిక పర్యటన తర్వాత సామ్ అమెరికా వెళ్లనుందట. దాదాపు ఏడాది పాటు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందట. ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులకు సంబంధించి అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసిందట. అయితే యూఎస్​ వెళ్లి వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుందట సమంత. అమెరికా నుంచి రాగానే ఈ భామ ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రొడక్షన్​లో నటించనున్నట్లు టాక్. ఇప్పుడు సామ్ నెక్స్ట్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

samantha

ఇంకెవరూ.. బీ టౌన్​లో తనకంటూ సొంత స్టార్​డమ్ ఏర్పరుచుకున్న వర్సటైల్ నటి తాప్సీ పన్ను. అమెరికా నుంచి ట్రీట్​మెంట్ తీసుకుని వచ్చిన తర్వాత సమంత.. తాప్సీ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే తాప్సీ ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్​గా రూపొందించనున్నారని బీటౌన్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో రానుందని తెలిసింది. అయితే సమంత.. తన అమెరికా పర్యటనపై కానీ, తాప్సీతో సినిమా విషయంపై కానీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి అనౌన్స్​మెంట్ చేయలేదు. మరి ఈ ఇద్దరూ స్టార్ లేడీస్​ కాంబోలో కనుక సినిమా వస్తే.. అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంటున్నారు.

- Advertisement -

ఇక సమంత విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా ఆరాధ్య పాటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు సిటడెల్ వెబ్ సిరీస్​లోనూ నటిస్తోంది సమంత. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్​తో కలిసి సందడి చేస్తోంది. ఈ సిరీస్​కు దర్శకధ్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్​లో వరుణ్, సమంతల మధ్య ఘాటు సన్నివేశాలు బాగానే ఉండనున్నాయట. మరోవైపు సామ్ ఫుల్ యాక్షన్​ మోడ్​లో ఈ సిరీస్​లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేయనుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here