Samantha : సమంతకు తీవ్ర అస్వస్థత.. మాట్లాడలేకపోతున్నా అంటూ పోస్ట్

- Advertisement -

Samantha : మయోసైటిస్ నుంచి సమంత కోలుకుంటుండగా.. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. వరుస సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమంత ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఆందోళలో ఉన్నారు.

samantha
samantha

ఇన్నేళ్లలో సమంత తన సినిమాలకి ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చుకోవడమే కాదు తనకంటూ సెపరేటు ప్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతుంది.ఈ భామ ఆశలన్ని ప్రస్తుతం శాకుంతలం మూవీపైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లకు పైగా సమయం కేటాయించింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో సామ్ కు ఇలా అవ్వడం చాలా బాధకరమని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

samantha post
samantha post

మరోవైపు సమంత తన ఆరోగ్య పరిస్థతిని వివరించింది. ‘‘ఈ వారం అంతా మీ మధ్య ఉండి.. మా చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ ప్రేమాభిమానాలను పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస ప్రమోషన్స్‌, షూటింగ్‌ షెడ్యూల్స్‌ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నా. ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్‌ అవుతున్నా’’ అని సమంత ట్విటర్ లో పోస్ట్ పెట్టింది.

- Advertisement -

యశోద’ తర్వాత సమంత నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. ఇందులో ఆమె శకుంతలగా నటించగా.. మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య నిర్మితమైన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. మయోసైటిస్‌కు గురైన సమంత గత కొన్ని నెలల నుంచి సినిమా షూటింగ్స్‌ అన్నింటికీ దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటోన్న ఆమె ఓ వైపు ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌.. మరోవైపు ‘సిటాడెల్‌’, ‘ఖుషి’ షూట్స్‌లో పాల్గొంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లోనూ వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here