రష్మికలో పని మాములుగా లేదు.. తెలుగు హీరోలతోనే కాదు హిందీ వాళ్లతోటి కూడా ప్రేమాయణాలు

- Advertisement -

రష్మిక అంటే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్లోనూ వీరాభిమానులు ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం నేషనల్ క్రష్ అని ఒక బ్రాండ్ ని సైతం సొంతం చేసుకుంది .చాలామంది కుర్రకారులు రష్మిక అందానికి ఫిదా అయిపోతారు. సాధారణ సినీ ప్రేక్షకులతో పాటు ఇండియన్ క్రికెటర్స్ సైతం రష్మిక మందన ఫ్యాన్స్ గా ఉన్నారు. దీంతో రష్మిక ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇక పుష్ప సినిమాతో పని ఇండియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

రష్మిక
రష్మిక

ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాలు, జనంలో క్రేజ్‌ అంతగా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా ఆ హంగామా తగ్గినట్టుంది. ఆమె ఇప్పుడు పూర్తిగా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప2, రెయిన్‌ బో, బాలీవుడ్‌లో యానిమల్‌ చిత్రాలు చేస్తుంది. మూడు డిఫరెంట్‌ మూవీస్‌ కావడం విశేషం. రెయిన్‌ బో లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది. పుష్ప2, యానిమల్‌ పాన్‌ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఈ సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకుంది రష్మిక మందన్నా.

నేషనల్ క్రష్
నేషనల్ క్రష్

ఇక తాజాగా ఈ నేషనల్ క్రష్ తెలుగు హీరోలు చాలదని హిందీ హీరోలతోనూ ప్రేమాయణాలు నడపనుంది. నిజ జీవితంలో కాదండోయ్.. సినిమాల్లో. రష్మిక మరో బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనీస్ బాజ్మీ, షాహిద్ కపూర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఏక్తా కపూర్ కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ మీద చర్చలు జరిగాయి. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినా, మేకర్స్ రష్మికకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. “ఈ సినిమాకు పలువురి పేర్లు పరిశీలించినా రష్మిక బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. ఇప్పటికే ఏక్తా కపూర్, దిల్ రాజు రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశారు. వాటిలో ఒకటి ‘గుడ్‌బై’ కాగా మరొకటి ‘వారిసు’. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here