Actress Rashmika : మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండపై పోస్ట్ పెట్టిన రష్మిక.. ఇలా దొరికిపోతున్నారేంటి!

- Advertisement -

Actress Rashmika గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలతో వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది. విజయ్ దేవరకొండ తో నటించిన గీతాగోవిందం సినిమాతో అందరికీ క్రష్ అయ్యింది. ఆ సినిమాతోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమ వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేస్తున్నారు.. కానీ అసలు మ్యాటర్ మాత్రం దాస్తున్నారని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ పరుశరామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

- Advertisement -

ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు జనాల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న తాజాగా ట్రైలర్ ను షేర్ చేసింది. ‘మై డార్లింగ్స్.. పరుశురామ్ , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీకు బెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 5 న వస్తుంది. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు పార్టీ కావాలి. మృణాల్.. ఆల్ ది బెస్ట్.. అంటూ’ రాసుకొచ్చింది.

 

ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక దీంతో మరోసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటున్న వార్తలు ఊపందుకున్నాయి.. ఈసారి ప్రమోషన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయింది.. దాంతో మళ్లీ వీరిద్దరిపై ట్రోల్స్ మొదలయ్యాయి.. ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే.. రష్మిక చేతిలో పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం చేస్తుంది. ఇవి కాకుండా ధనుష్ సరసన కుబేరలో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ ఏడాది ఎన్ని హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here