Pushpa 2 : పుష్ప2 లో నా అసలు స్వరూపాన్ని చూస్తారు.. రష్మిక దేని గురించి మాట్లాడుతుందో..!

- Advertisement -

Pushpa 2 : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఎడిటింగ్ వర్క్ ను కూడా మొదలు పెట్టేశారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రష్మిక మందన్న పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది.

- Advertisement -

ఈ సినిమాలో తన పాత్ర ఛాలెంజ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. మొదట పుష్ప సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ సినిమా కథ ఏంటి? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు? ఇంతకీ జనాలకు ఏం చూపించబోతున్నారు? అనే విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ను చూస్తారని రష్మిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆగస్టు 15 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here