కావాలనే అలా చేశాం.. మేనేజర్ మోసంపై రష్మిక క్లారిటీ..

- Advertisement -

నటి రష్మిక మందన్న ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచింది. రష్మిక మందన్న తన మేనేజర్ చేతిలో మోసపోయిందని పుకార్లు ఉన్నాయి. రష్మిక మేనేజర్‌ దాదాపు 80 లక్షల రూపాయల మోసం చేశారని వార్తలు వచ్చాయి. అయితే దీని గురించి నటి నుండి అధికారిక సమాచారం లేదు. ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రష్మిక మందన్న ఓ ప్రకటన విడుదల చేసింది.

రష్మిక
రష్మిక

గత కొన్నేళ్లుగా రష్మికకు ఓ వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నారు. సినిమా కాంట్రాక్ట్, రెమ్యునరేషన్, అడ్వర్టైజింగ్, బిజినెస్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, ఇతర ఖర్చులను నిర్వహించారు. అయితే తాజాగా మేనేజర్ ఉద్యోగం మానేశారు. కానీ ఈ వార్త సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వేరేలాగా ప్రచురించారు. రష్మిక మేనేజర్ ఆమెను 80 లక్షలు మోసం చేశాడు.. కాబట్టి రష్మిక అతన్ని తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే రష్మిక మందన్న స్వయంగా ఆ వార్తలన్నింటినీ ఖండించింది. పరస్పర అంగీకారంతో మేనేజర్ ఉద్యోగం నుండి తప్పుకున్నట్లు తెలిపింది.

Rashmika

రెండు రోజుల క్రితమే ‘యానిమల్‌’ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసిన రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’ లో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం.. 2021లో విడుదలై హిట్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్‌’కి సీక్వెల్‌ అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన చిత్రమే ‘యానిమల్‌’. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here