Rajendra Prasad : నరేష్ ఒక నిత్యపెళ్లికొడుకు అంటూ మీడియా ముందు పరువు తీసేసిన రాజేంద్ర ప్రసాద్

- Advertisement -

Rajendra Prasad : యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించిన అన్నీ ‘మంచి శకునములే’ చిత్రం అతి త్వరలోనే విడుదల కాబోతుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.గత కొంతకాలం నుండి సంతోష్ శోభన్ ఏ సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి.కనీస స్థాయి వసూళ్లకు కూడా నోచుకోలేక పోతున్నాయి ఆయన లేటెస్ట్ సినిమాలు.

Rajendra Prasad
Rajendra Prasad

సినిమాలు బాగాలేక ఫ్లాప్ అవ్వడం వేరు, కానీ బాగున్న సినిమాలు కూడా ఇతనివి టైం కలిసి రాక బోల్తా కొట్టేస్తున్నాయి.అయితే ఈసారి బాక్స్ ఆఫీస్ గురి తప్పదు అనే బలమైన నమ్మకం తో ఉన్నాడు సంతోష్.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ని నిన్న ఏర్పాటు చేసారు, ఈ ప్రెస్ మీట్ లో ఆ చిత్రం లో నటించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Ani Manchi Shakunale movie

ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా మరో సీనియర్ హీరో నరేష్ కూడా నటించాడు, ఈ సందర్భంగా ఒక విలేఖరి రాజేంద్ర ప్రసాద్ ని ఒక ప్రశ్న అడుగుతూ ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు కదా, మీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో ఎలా నటించారు అని అడుగుతారు, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ దానికి సమాధానం చెప్తూ ‘నరేష్ నిజంగానే కత్తి, కానీ నేను కత్తి కాదు..చూసారా వాడు ఎలా ఉన్నాడో, ఇప్పటికీ పెళ్ళికొడుకు లాగానే అందంగా ఉన్నాడు.నిత్యపెళ్లికొడుకు మావాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -
Rajendra Prasad

రాజేంద్ర ప్రసాద్ నరేష్ ని నిత్యపెళ్లి కొడుకు అనే మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఎందుకంటే నరేష్ ఈమధ్యనే నాల్గవ పెళ్లి చేసుకున్నాడు. ఆయన మీద సోషల్ మీడియా గత కొంతకాలం గా విపరీతమైన ట్రోల్ల్స్ వస్తున్నాయి,ఈ క్రమం లో రాజేంద్ర ప్రసాద్ సరదాగా అన్నప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Naresh Rajendra Prasad
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here