Rajamouli : ఆ హీరోయిన్ న్ని తెగ పొగిడేస్తున్న రాజమౌళి.. ఏకంగా సాయిపల్లవితో పోల్చేశాడుగా..!

- Advertisement -

Rajamouli : మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు చిత్రం తెలుగులోనూ మంచి కలెక్షన్లు దక్కించుకుంటోంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ. తెలుగులో ఈ మూవీల మార్చి 8వ తేదీన రిలీజ్ అయింది. తెలుగులోనూ ప్రేమలు చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ రావటంతో తొలి రోజు కంటే నాలుగో రోజు ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

దీంతో ప్రేమలు తెలుగు టీమ్ హైదరాబాద్‍లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ప్రేమలు తెలుగు సక్సెస్ మీట్‍కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‍ను అభినందించారు. ప్రేమలు సినిమాలో హీరోయిన్‍గా నటించిన మమితా బైజూను రాజమౌళి ప్రశంసించారు. గీతాంజలి (1989) సినిమాలో గిరిజ, ఆ తర్వాత సాయిపల్లవి చూపించిన ఎఫెక్ట్‌కు మమితా కూడా చూపిస్తారని తాను అనుకుంటున్నట్టు రాజమౌళి అన్నారు. మమితా బైజూ ఎనర్జీ చూస్తే అందరి హృదయాలను ఆమె గెలువబోతోందని తనకు అనిపించిందని రాజమౌళి చెప్పారు.

“ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమితా చాలా నచ్చింది. ఆమెనే తర్వాత అందరి హృదయాలను మెలిపెడుతుందని అనిపించింది. గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు.. ఆ తర్వాత సాయిపల్లవి వచ్చినట్టు. వాళ్లు ఎలాంటి ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేశారో మమితాకు కూడా అలాగే చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈమెపై మీరు ప్రేమ కురిపిచడం నేను చూస్తున్నా” అని రాజమౌళి చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here