Gutur Karaam : మహేష్ బాబు ఫ్యాన్స్ ని బూతులు తిట్టిన ‘గుంటూరు కారం’ నిర్మాత వంశీ!

- Advertisement -

Gutur Karaam : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Gutur Karaam
Gutur Karaam

కానీ రీసెంట్ గా విడుదల చేసిన ‘ఓ మై బేబీ’ సాంగ్ కి మాత్రం చాలా దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలై రెండు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ పాటకి 5 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. ఇది మహేష్ బాబు కెరీర్ లో మాత్రమే కాదు, స్టార్ హీరోల కెరీర్లో ఇంత చెత్త రికార్డు ఎవరికీ లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ థమన్ పై చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు.

Mahesh babu

థమన్ ని ట్యాగ్ చేసి వాళ్లకి ఎన్ని బూతులు వచ్చో అని బూతులు వాడారు. ఫ్యాన్స్ నుండి వచ్చిన ఈ వైల్డ్ రెస్పాన్స్ కి ఆ చిత్ర నిర్మాత వంశీ చాలా దారుణమైన కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఏమి చెయ్యాలో..ఏమి చేస్తున్నామో అన్నీ మాకు తెలుసు..జనవరి 12న మాట్లాడుకుందాం’ అంటూ ‘ఎనిమల్’ చిత్రం క్లైమాక్స్ ఎండ్ క్రెడిట్స్ పడే ముందు రణబీర్ కపూర్ డబుల్ మీనింగ్ వచ్చే విధంగా చూపించిన యాక్ట్ కి సంబంధించిన వీడియో ని వేసి చెప్తాడు.

- Advertisement -

దీనికి మహేష్ బాబు ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఆయన మాట్లాడుతూ ‘ఒక నిర్మాతగా నేను మాట్లాడిన మాటలకు మీరు హర్ట్ అయ్యుండొచ్చు.. కానీ మీరు మాట్లాడే అసభ్యకరమైన మాటలకు నా టీం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. మీ ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ బూతులు తో కూడినవి వద్దు ‘ అంటూ ఆయన కామెంట్స్ చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here