అన్నా లెజినావా తో విడాకుల వార్త పై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఫేక్ రూమర్స్ కి ఇక చెక్

- Advertisement -

గత రెండు మూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినావా తో విడాకులు తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో వైసీపీ మీడియా ఒక రేంజ్ ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ లెవెల్ లో అంటే ఏకంగా నేషనల్ మీడియా లెవెల్ లో అన్నమాట.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఎప్పుడైతే ఈ వార్త బాగా వ్యాప్తి చెందిందో అప్పటి నుండి అభిమానులు కూడా నిజంగానే విడాకులు తీసుకున్నాడా ?, జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఈ రూమర్స్ పై స్పందించలేదు, అంటే నిజమేనేమో అని అనుకున్నారు. కానీ నేడు సోషల్ మీడియా లో జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ రూమర్స్ కి చెక్ వేశారు. హైదరాబాద్ లోని తన సొంత నివాసం లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమం లో తన సతీమణి అన్నా లెజినావా తో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా షేర్ చేసారు.

ఎలాంటి విమర్శలు చెయ్యకుండా , చాలా కూల్ గా సమాధానం ఇస్తూ , ప్రత్యర్థులకు కాలిపొయ్యేలా చేసారు. ఇక గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో విష ప్రచారాలు చేసిన వైసీపీ మీడియా పై పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఇతర హీరోల అభిమానులు కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విలువలు లేని రాజకీయాలు ఇంత నీచంగా చేస్తారా అంటూ నోటికి అందిన బూతులు తిడుతున్నారు.

- Advertisement -

గత కొంతకాలం క్రితం అన్నా లెజినావా తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు బాగాలేవనే విషయం తెలుసుకొని పోలాండ్ కి వెళ్ళింది. అక్కడ కొన్ని నెలలు గడిపిన తర్వాత రీసెంట్ గానే ఆమె హైదరాబాద్ కి వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ నెల 10 వ తారీఖు నుండి వారాహి రెండవ విడత యాత్ర ని ప్రారంభించబోతున్నాడు. మరో పక్క ఆయన హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here