Bigg Boss కి ‘గుడ్ బై’ చెప్తున్న పల్లవి ప్రశాంత్.. నేను ఉండలేను అంటూ ఏడుపులు!

- Advertisement -

Bigg Boss : ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుందో మన అందరికీ తెలిసిందే. ఆసక్తికరమైన టాస్కులతో, ప్రతీ కంటెస్టెంట్ మొదటి వారం నుండి ప్రాణం పెట్టిమరీ ఆడుతున్నారు. దానికి తోడు బిగ్ బాస్ ఇచ్చే పవర్ అస్త్ర టాస్కు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

Bigg Boss
Bigg Boss

ఇక పోతే ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 లో నిలబడగలిగే సత్తా ఉన్న వారిలో ఒకడు పల్లవి ప్రశాంత్. సామాన్య రైతు బిడ్డగా, ఇంస్టాగ్రామ్ వీడియోస్ తో పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అతనిని అందరూ మొదటి వారం నుండే టార్గెట్ చెయ్యడం తో ప్రేక్షకుల్లో మరింత సానుభూతి పెరిగింది.

అయితే పొలాల్లో పుట్టి, అక్కడి వాతావరణం కి బాగా అలవాటు పడిన వాళ్లకు బిగ్ బాస్ హౌస్ ఒక జైలు లాంటిది. భరించడం చాలా కష్టం, గతం లో సంపూర్ణేష్ బాబు కూడా ఇలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక, బ్రతిమిలాడి ఏడ్చి గగ్గోలు పెట్టి మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంగవ్వ కూడా ఇలాగే అక్కడి వాతావరణం ని తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.

- Advertisement -

ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా నాల్గవ వారం లో అదే చేసాడట. టాస్కులు ఆడుతున్న సమయం లో అతని తలకి బలమైన దెబ్బ తగలడం తో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇంటికి వెళ్తాను అని బిగ్ బాస్ ని ఏడుస్తూ బ్రతిమిలాడాడట, కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ప్రశాంత్ ప్రత్యేకంగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సర్ది చెప్పడం తో పల్లవి ప్రశాంత్ హౌస్ లో ఉన్నాడట. ఇది టెలికాస్ట్ లో చూపిస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here