Nithya Menen : తమిళ హీరో వేధింపుల విషయంలో మాట మార్చిన నిత్యామీనన్.. సినిమా ఎఫెక్ట్ ఏమో..!

- Advertisement -

Nithya Menen : తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నిత్యామేనన్‌. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించడమే కాకుండా, ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఆమె చేస్తుంది. త్వరలో ‘కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

Nithya Menen
Nithya Menen

ఓ ఇంటర్వ్యూలో నిత్యా మేనన్‌ మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ సమయంలో ఒక తమిళ్‌ హీరో తెగ వేధించాడు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా’ అని చెప్పినట్లు ఓ ట్వీట్ ట్రెండ్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు అందరూ ‘ఎవరా తమిళ హీరో’ అంటూ తెగ వెతకడం మొదలు పెట్టేశారు. ఇదే విషయమై ఓ విలేకరి నిత్యామేనన్‌ను సంప్రదించగా, సదరు వార్తలను ఆమె ఖండించారు. తానెప్పుడూ అలా అనలేదని అన్నారు. ‘ఓ మై గుడ్‌నెస్‌’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘మీరు చెప్పిన సమాధానంతో ట్వీట్‌ చేయవచ్చా’ అనగా, ఆమె అందుకు సమ్మతించారు. మరికొందరు నెటజన్లు అప్పుడు అన్నమాటలు ఇప్పుడు ఎందుకు తప్పు అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నిత్యామేనన్‌ తాజా చిత్రాల విషయానికొస్తే ఆమె కీలక పాత్రలో గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు ‘కోలాంబి’ అనే మలయాళ చిత్రంతో పాటు, ధనుష్‌ 50వ చిత్రంలోనూ నిత్యామేనన్‌ నటిస్తోంది. మరోవైపు డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా ‘మాస్టర్‌ పీస్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here