వాళ్లంతా నాకు మెసేజ్ లు పెడుతున్నారు.. అర్థం చేసుకోండి.. ఆ సినిమాపై అసలు విషయం చెప్పిన నేహా శెట్టి

- Advertisement -

డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రాధికా పాత్రలో నేహా నటన ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఆమె నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈ సినిమా కొనసాగింపు తెరకెక్కుతోంది. ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. టిల్లు స్క్వేర్ లో నటించకపోవడానికి కారణాన్ని తెలిపింది నేహా.

నేహా శెట్టి
నేహా శెట్టి

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధికా పాత్రకు మంచిపేరు వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ మూవీ సీక్వెల్ పై నిర్మాతలు ముందు నుంచి క్లారిటీతో ఉన్నారు. డీజీ టిల్లు సినిమాకు.. ఇప్పుడు రానున్న సినిమాకు సంబంధం లేదు. అది వేరే కథ ఇది వేరే కథ.

Neha Shetty

అందుకే నేను ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడం లేదు అని తెలిపింది నేహా. అయితే చాలా మంది అభిమానులు టిల్లు స్క్వేర్ లో నటించకపోవడమతొ నిరాశపడ్డారు. నాకు రోజూ మెసేజ్ లు పెడుతున్నారు. మీరు నటించవచ్చుగా.. టిల్లుని అడగండి ఒక్కసారి అంటూ మెసేజ్ లు పెడుతున్నారు అని తెలిపింది నేహా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here