Nayanathara : నా మొగుడి కంటే ఆ హీరో అంటేనే ఎక్కువ ఇష్టం.. పబ్లిక్ గా చెప్పిన నయనతార

- Advertisement -

Nayanathara : దర్శకడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార 2022 జూన్ 9వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్ళుగా ప్రేమించుకున్న వీరిద్దరూ, పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లయిన నాలుగు నెలల తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల వీరి మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్య నయనతారకు సోషల్ మీడియాలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విఘ్నేష్ శివన్. నా జీవితానికి ఆధారం నువ్వే అంటూ మొదలుపెట్టిన విఘ్నేష్, ఈ ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి, అనేక ఒడిదొడుకులు వచ్చాయి. ఊహించని మలుపులు, అనేక రకాల పరీక్షలు ఎదురయ్యాయి. అన్నింటిలో నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్లు కూడా పెట్టుకున్నారు.

Nayanathara
Nayanathara

అయితే తాజాగా నయనతార మాత్రం తనకు బాలీవుడ్ హీరో షారుక్ అంటే చచ్చేంత ఇష్టమని చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇదంతా ఎప్పుడు చెప్పిందంటే తాను నటించిన జవాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పింది. దీంతో చేసేదేమీ లేక తన భర్త కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌తో కలిసి నయనతార నటించిన సినిమా ‘జవాన్‌’. దీని ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో విఘ్నేశ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు.

నయనతార

షారుక్‌తో కలిసి నటించడం తన కలగా ఇప్పటికే నయనతార చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన విఘ్నేశ్.. తనకు ఇష్టమైన వాళ్లందరినీ ఒకే చిత్రంలో చూడడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు అట్లీ గురించి మాట్లాడుతూ తనని చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. ‘‘అట్లీ తొలి బాలీవుడ్‌ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీని వెనుక అతడి ఓర్పు, కృషి, కష్టం అన్ని ఉన్నాయి’’ అని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here