కొడుకు సినిమా కోసం జనసేన పార్టీ కి కోట్ల రూపాయిలు నష్టం తెచ్చిన నాగబాబు.. మండిపడుతున్న ఫ్యాన్స్!

- Advertisement -

ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నామని ఆ చిత్ర నిర్మాత నాగబాబు అధికారికంగా తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 31 వ తేదీన విడుదల చేద్దాం అని అనుకున్నారు.

నాగబాబు
నాగబాబు

కానీ ఆయన కొడుకు వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘గాండీవ ధారి అర్జున’ చిత్రం ఆగస్టు 25 వ తారీఖున విడుదల అవ్వబోతుండడంతో ఆ సినిమా మీద ప్రభావం పడే అవకాశం ఉందని సెప్టెంబర్ 2 వ తేదికి వాయిదా వేశారు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. కనీసం మొదటి రోజు కూడా మినిమం గ్యారంటీ వసూళ్లను రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని మళ్ళీ 31 వ తేదికి జరిపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా 31 వ తేదికి జరగడానికి కూడా ఒక కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే సెప్టెంబర్ 1 వ తేదీన విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ విడుదల కాబోతుంది. పెద్ద సినిమా కాబట్టి ఈ చిత్రం కారణంగా గుడుంబా శంకర్ కి సీడెడ్ , ఈస్ట్ , నెల్లూరు మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో థియేటర్స్ ఇవ్వడానికి బయ్యర్స్ ఒప్పుకోవడం లేదు.

- Advertisement -

అందువల్ల ఇక చేసేది ఏమి లేక ఆగష్టు 31 వ తేదీ నుండి షోస్ ప్రారంభిస్తున్నారు. 31 నుండి ప్రారంభించి సెప్టెంబర్ 3 వ తేదీ వరకు నాన్ స్టాప్ గా షోస్ వెయ్యబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు సాయంత్రం రానుంది. ఈ షోస్ ద్వారా మొదటి రోజు రికార్డు కొట్టినా కొట్టకపోయినా, ఫుల్ రన్ లో ఖుషి రికార్డు ని బద్దలు కొట్టడం మాత్రం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్,చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here