గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కినా నాగచైతన్య సినిమా.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది!

- Advertisement -

శివ నిర్వాణ దర్శకత్వం లో అక్కినేని నాగ చైతన్య, సమాంత హీరో హీరోయిన్లు గా నటించిన ‘మజిలీ’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాదు, టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య మరియు సమంత కలిసి నటించిన సినిమా ఇది.

నాగచైతన్య

ప్రేమలో విఫలమైన ఒక కుర్రాడికి ఇంట్లో పెద్దలు బలవంతంగా ఒప్పించి సమంత తో పెళ్లి చేస్తారు. ఆ తర్వాత హీరో పాత ప్రేమని మర్చిపోయి, సమంత ని భార్యగా అంగీకరిస్తాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా అప్పట్లో 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇదే సినిమాని హిందీ లో రితేష్ దెశముఖ్ మరియు జెనీలియా కలిసి నటించారు.

Naga chaitahnya

వీళ్లిద్దరూ కూడా నిజజీవితం లో భార్యభర్తలు అనే విషయం మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమా ‘వేద్’ పేరుతో రీమేక్ అయ్యి టాలీవుడ్ లో కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అక్కడ ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక పోతే ఈ సినిమా లేటెస్ట్ గా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఎందుకంటే రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ ప్రవాహ్ అనే ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది.

- Advertisement -

ఈ సందర్భంగా ఆ ఛానల్ కి సంబంధించిన 1446 ఎరుపు రంగు గొడుగులను హార్ట్ షేప్ లో అమర్చారు. సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అలా చేసారు. ఇలా గతం లో ఎవ్వరూ కూడా చెయ్యలేదు, చరిత్రలో ఇదే తొలిసారి, అందుకే అలా ఈ విషయం లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కించారు.

అలా నాగ చైతన్య నటించిన సినిమాని రీమేక్ చేస్తే, అది గిన్నిస్ బుక్ కి ఎక్కినందుకు గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here