Tollywood : సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్న అలనాటి తారలు

- Advertisement -

Tollywood  : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కథానాయికల్లో చాలా కొద్ది మంది మాత్రమే దశాబ్ధాల పాటు తిరుగులేని చక్రం తిప్పుతూ కథానాయకులకు దీటుగా అవకాశాలు సంపాదించగలుగుతారు. ఒక్కసారి హీరోయిన్ కుపెళ్లి అయిపోయిందంటే.. ఇక ఆమె ఇంటి గడప తొక్కడానికి అవకాశాలు కూడా తడబడుతుంటాయి. అలా పెళ్లయి చాలా మంది హీరోయిన్ల తమ కెరీర్ మిడిల్ లోనే ఎండ్ అయిపోయింది. కొందరు మాత్రం పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వెండితెరపై దూసుకెళ్తున్నారు. ఓ వైపు కుటుంబం, పిల్లల బాధ్యత చూసుకుంటూనే మరోవైపు తమకు నచ్చిన రంగంలో జెడ్ స్పీడ్ లో వెళ్తున్నారు. అలాంటి కొందరు నాయికల గురించి తెలుసుకుందాం.

Nadhiya
Nadiya

నదియా / Nadiya :  ఈ పేరు వినగానే ఈ తరానికి గుర్తొచ్చేది అత్తారింటికి దారేదిలో అత్త పాత్ర. కానీ ఒకప్పుడు ఈమె వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార. కోట్లాది మంది ప్రేక్షకులను తనదైన నటనతో మంత్రుముగ్ధులను చేసిన బ్యూటీ నదియా. ఈ బ్యూటీ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఏం చెబుతోందంటే.. ‘1984లో 18 ఏళ్ల వయసులో వచ్చి, 4 ఏళ్లలోనే 27 సినిమాల్లో కథానాయకిగా చేశా. 1988లో చేతి నిండా సినిమాలున్నప్పుడే శిరీష్‌ గాడ్‌బోలేను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యా. చాలా కాలం అమెరికా, యూకేల్లో ఉన్నాం. మా ఇద్దరమ్మాయిలు సనమ్‌, జనా పెంపకంలో బిజీ అయ్యా. 16 ఏళ్ల గ్యాప్‌ తర్వాత, మళ్లీ నటన ప్రారంభించా. ఇప్పుడు ఏడాదికి రెండు మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ తిరిగి బిజీ అయ్యా. అయితే ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేదు.

సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శిరీష్‌ ప్రోత్సహించినా పిల్లల గురించి ఆలోచించా. నేను షూటింగ్‌కు వెళితే వాళ్ల పనంతా ఎవరు చూస్తారని ఆలోచించా. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే మా అత్తామామ చేయూతగా నిలిచారు. తామున్నామని, నటించమని ప్రోత్సహించారు. అలా షూటింగ్‌కు వెళ్లినా మధ్యలో వచ్చి పిల్లల బాధ్యత తీసుకొనేదాన్ని. అప్పటికే వాళ్లిద్దరూ తమ పనులు తాము చేసుకోగలిగే స్థాయికెదిగారు. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పే దాన్ని. క్రమశిక్షణ, సమయపాలన, చేసే ప్రతి పనినీ ప్రేమించడమెలాగో చెప్పా. నా శుభ్రత చూసి ఓసీడీ అంటూ వెక్కిరించే వాళ్లు. ఇప్పుడు వాళ్లూ పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఇంట్లో, సెట్లో ఉత్సాహంగా ఉంటూ ఒత్తిడికి దూరంగా ఉండే నన్ను చూసి పిల్లలూ అదే నేర్చుకున్నారు. ఈతరం పిల్లలు కదా వాళ్ల నుంచి నేనూ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటా’. అని చెప్పారు నదియా.

- Advertisement -
Bhumika Chawla
Bhumika Chawla

భూమిక : ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో వేయి వీణలు మోగుతాయి. నడుము అనే పదం వినగానే గుర్తొచ్చేది ఈమె పేరే. ఖుషి మూవీలో భూమిక పోషించిన మధు పాత్ర ఎవర్ గ్రీన్. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక రేంజ్ లో స్టార్ డమ్ వచ్చిన సమయంలో పెళ్లి చేసుకున్న ఈ భామ చాలా ఏళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. మరి భూమిక తన పెళ్లి, పిల్లలు, కెరీర్ గురించి ఏమంటోందంటే.. ‘మోడలింగ్‌ నుంచి నటిగా మారా. ఈ 22 ఏళ్లలో తెలుగు సహా 7 భాషల్లో 58 పైచిలుకు చిత్రాల్లో నటించా. భరత్‌ ఠాకూర్‌తో పెళ్లయ్యాకా నటిస్తూనే ఉన్నా.

యష్‌కు తల్లైన తర్వాత వాడి కోసం కాస్త విరామం తీసుకున్నా. పిల్లలు పెద్దైన తర్వాత వాళ్లతో కలిసి చూడగలిగేలా నా పాత్రలుండాలనుకొంటా. అమ్మయ్యాక బోల్డంత బాధ్యత వస్తుంది. వాడిని చూసుకొంటూ, షూటింగ్‌లకు హాజరవడం కష్టమే. ఇప్పుడు వాడికి ఎనిమిదేళ్లొచ్చాయి. ఇద్దరం ఎక్కువగా వంటింట్లో కలిసి పని చేస్తుంటాం. కేక్‌లు, ఇతర వంటకాలు చేసుకొని తింటాం. స్విమ్మింగ్‌ చేస్తాం. ఇప్పటికీ కథల పుస్తకాలు చదివి వినిపించాల్సిందే. అంతరిక్షం, నక్షత్రాలు వంటి వాటిపై చాలా పుస్తకాలు కొనిపెట్టా. ఏ విషయంలోనూ ఎవరినీ నొప్పించకుండా, అదే సమయంలో ఎదుటి వారి వ్యాఖ్యల ప్రభావానికి లోనుకాకుండా ఉండేలా పెంచుతున్నా. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వంటివి నేర్పుతుంటా. కోరిందల్లా కాకుండా అవసరమైనది మాత్రమే కొనిస్తా. నేనెంత బిజీగా ఉన్నా.. ఆ లోటు వాడికి తెలియనివ్వను’. అంటోంది ఈ బ్యూటీ.

Simran
Simran

 

సిమ్రన్ టాలీవుడ్ లో జీరో సైజ్ అంటే గుర్తొచ్చే మొదటి హీరోయిన్. ఒక్క మగాడు అని పాడుతూ మగాళ్లకు నిద్రపట్టకుండా చేసేసింది. 19 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో అగ్రకథానాయకులందరితో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ భామ. ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ తెలుగు తెరపై కనుమరుగైపోయింది. సిమ్రన్ ను బాగా మిస్ అవుతున్నామే అనుకున్న తరుణంలో సెకండ్ ఇన్నింగ్స్ కి ప్లాన్ చేసింది. మరి ఫ్యామిలీయే ఫస్ట్ అంటున్న ఈ బ్యూటీ తన కెరీర్, కుటుంబం గురించి ఏం చెబుతోందంటే.. 19 ఏళ్లప్పుడే నటించడం మొదలు పెట్టా. పదేళ్లలో తెలుగు సహా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించా.

2004లో బాల్య స్నేహితుడు దీపక్‌బగ్గాను పెళ్లి చేసుకొని సినిమాకు బ్రేకిచ్చా. మా ఇద్దరబ్బాయిలు అధీప్‌, అదిత్‌ల సంరక్షణ నేనే చూసేదాన్ని. వాళ్లు కాస్త పెద్దయ్యాక, పదేళ్ల వ్యవధి తర్వాత తిరిగి నటించడం ప్రారంభించా. అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూనే, నటననూ కొనసాగిస్తున్నా. కుటుంబానికే నా మొదటి ప్రాధాన్య. పిల్లల్ని ఆహారం విషయంలో మెప్పించడం చాలా కష్టం. ఎన్ని రకాలు వండినా ఏదీ సరిగ్గా తినేవారు కాదు. ఓ తల్లిగా పిల్లలకు పోషకాహారాన్ని తినిపించడం ఎంత కష్టమో అప్పుడు తెలిసేది. నాకు నటన కన్నా వీరితో తినిపించడమే పెద్ద సవాల్‌. చిత్రాల ఎంపికలో నేను సలహాలు అడిగే స్థాయికి ఇప్పుడు ఎదిగారు. రీఎంట్రీకి అవకాశం వచ్చినప్పుడు పిల్లల కోసం చిన్న షెడ్యూల్స్‌ పెట్టుకునే దాన్ని. ముంబయి నుంచి వెళ్లి, పూర్తయిన వెంటనే ఇంటికి చేరుకొనే దాన్ని. మధ్యలో దీపక్‌ చూసుకొనేవారు. ఇప్పటికీ షూటింగ్‌లో ఉన్నా ఎప్పటికప్పుడు పిల్ల్లలతో మాట్లాడతా. అన్నీ తెలుసుకుంటా’. అని సిమ్రన్ చెబుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here