రామ్ చరణ్ కూతురుకి బంగారు ఊయల చేయించి బహుమతిగా పంపిన ముఖేష్ అంబానీ..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు రీసెంట్ గానే ఒక మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందిరికీ తెలిసిందే. ఈ పాప అడుగుపెట్టిన దగ్గర నుండి ఇంట్లో ఆనందాలకు కొదవే లేదు. మెగా కుటుంబం లో ఎంత ఆనందం ఉంటుందో ఊహించుకోగలం కానీ, మెగా అభిమానుల్లో ఉన్న ఆనందాన్ని మాత్రం కళ్లారా చూస్తున్నాము. ఇక పోతే నేడు రామ్ చరణ్ కూతురుని ఊయలలో వెయ్యబోతున్నారు.

రామ్ చరణ్
రామ్ చరణ్

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి కుటుంబం లో ఉన్న వాళ్ళందరూ హాజరు కాబోతున్నారు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ప్రస్తుతం ఆయన ‘వారాహి విజయ యాత్ర’ లో బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆయన ఈ ఫంక్షన్ కి రాలేకపోతున్నాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతుర్ని పవన్ కళ్యాణ్ చూడలేదు అనే విషయం అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయం.

అదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కూతురు కోసం ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా ఒక బంగారం తో ఒక ఊయల చేయించి బహుమతి గా పంపాడట. ఈ విషయాన్నీ స్వయంగా మెగా ఫ్యామిలీ కి చెందిన సన్నిహితులే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అంబానీ కుటుంబం తో అటు చిరంజీవి కుటుంబానికి కానీ, ఇటు ఉపాసన కుటుంబానికి కానీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.

- Advertisement -

తన సొంత మనమరాలు గా భావించే ముఖేష్ అంబానీ ఈ బహుమానతిని పంపాడట, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక ఈ విషయాన్నీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం తో సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటున్నారు. ఇక పోతే నేడే రామ్ చరణ్ తన కూతురుకి నామకరణం చెయ్యబోతున్నాడు, ఏమి పేరు పెట్టబోతున్నాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here