Mrunal Thakur : ఈ మధ్య హీరోయిన్ల స్పెషల్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హీరోయిన్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. తెలుగులో ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమానే కానీ క్రేజ్ మాత్రం మాములుగా లేదనే చెప్పాలి.. పాన్ ఇండియా హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఫాలోయింగ్ ను అందుకుంది..విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ అమ్మడు సినిమా..

తన అందం, నటనతో మొదటి సినిమాకే మంచి మార్కులు వేయించుకుంది.. తెలుగు అమ్మాయిలాగా అల్లరించింది.. ప్రేక్షకులను కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేసింది..ఈ సినిమా లో ఆమె నటన అందరినీ తెగ ఆకట్టుకుంది. చేసింది.. తెలుగు అయినా.. వాస్తవానికి ఆమె బాలీవుడ్ భామ..
తన సినీ కెరీర్ ను బుల్లితెర నుంచి ప్రారంభించిన ఆమె.. వెండితెరలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? లేకపోతే మీకు ఓ చిన్న క్లూ ఇమ్మంటారా..?.. గెస్ చెయ్యొచ్చు.. ఈ సినిమా ఈ మధ్య తెగ వినిపిస్తుంది.. తెలుగు ప్రజలకు సీతగా పరిచయం అయ్యింది..
ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్.. మహారాష్ట్రలోని ధూలేలో జన్మించిన మృణాల్.. కాలేజీ రోజుల్లోనే బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2014లో మరాఠీ ‘విట్టి దండు’ తో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. తన నటనతో అందర్ని ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, 2018లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్ ‘సూపర్ 30’లో హృతిక్ రోషన్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా‘, ‘జెర్సీ’ మూవీస్తో ప్రేక్షకులను అలరించింది..అయితే సీతారామం సినిమాతో ఫెమస్ అయ్యింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది..