Chakri: అన్నయ్య చనిపోయాక ఆస్తులన్నీ అమ్ముకొని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న చక్రి సోదరుడు..

- Advertisement -

Chakri: అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్ , శివమణి , సత్యం, దేశముదురు లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం సమకూర్చిన సినీ సంగీత దర్శకుడు చక్రి అందరికీ సుపరిచితమే.. టాలీవుడ్ లో మంచి ఫేమ్ ను సంపాదించుకున్న చక్రి అనూహ్యంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.. ఈయన లేని లోటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చక్రి భార్య గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.

Chakri
Chakri

అన్నయ్య చక్రి చనిపోకముందు మా ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండేవి కాదని, అందరం ప్రశాంతంగా ఉండే వాళ్ళమని మహిత్ తెలిపారు. కానీ అన్నయ్య చనిపోయిన తరువాత ఆస్తి తగాదాలు వచ్చాయని ఒకవైపు అన్నయ్య ఈ లోకంలో లేరన్న బాధ మరోవైపు ఆస్తి గొడవలు ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ చాలా నరకం అనుభవించామని .. అన్నయ్య ఆస్తులలో కొన్నింటిని వదిన అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడ మరొక వ్యక్తిని పెళ్లి చేస్తుందని ప్రస్తుతం ఆమె సంతోషంగా ఉందని మహిత్ తెలిపారు.

ప్రస్తుతం ఆమెకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని మహిత్ తెలిపారు. ఇప్పటికీ అన్నయ్య ఆస్తికి సంబంధించిన కొన్ని కేసులు కోర్టులో నలుగుతున్నాయని.. ఆ విషయం ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అని మహీత్ అన్నారు. చక్రి సోదరుడు మహి పరారీ అనే చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here