Mehreen Pirzada: మారుతున్న కాలం.. జీవన విధానాల కారణంగా ఈ రోజుల్లో చాలామంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని తమకి నచ్చినప్పుడు మాత్రమే పిల్లల్ని కంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన అండాలను భద్రపరుచుకుంది. తన తల్లి గైనకాలజిస్ట్ మధు చోప్రా సలహా మేరకు అలా చేశానని తాను అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నా కెరీర్ లో ఒక నిర్ధిష్ట స్థానానికి చేరుకోవాలని అనుకున్నా. అందుకే అమ్మ చెప్పినట్టుగా ముప్పై ఏళ్ల వయసులో అండాలు ఫ్రీజ్ చేయించానని చెప్పింది. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి ప్రియాంక తల్లి అయ్యింది.
ప్రియాంక చోప్రా మాత్రమే కాదు. బాలీవుడ్లో చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరించారు. ఏక్తా కపూర్ 2019లో సరోగసీ ద్వారా తల్లి అయ్యింది. ఆ మరుసటి సంవత్సరం ఆమె 36 సంవత్సరాల వయస్సులో ఎగ్ ఫ్రిజింగ్ ను అనుసరించిందట. ఇప్పుడు ఎక్కువ మంది సెలబ్రిటీ అనుసరిస్తున్న పద్ధతి సరోగసీ. ప్రియాంక చోప్రా తర్వాత లేడి సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ దంపతులు కూడా సరోగసీ ద్వారానే కవలలకు జన్మనిచ్చారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయించి తమకు నచ్చినప్పుడు బిడ్డలను కనేలా ఇది సహాయపడుతుంది.
తాజాగా వారి జాబితాలో చేరిపోయింది యంగ్ హీరోయిన్ మెహ్రీన్.. తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ పేరొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్ నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో హీరోయన్గా పరిచయమై తర్వాత పలు హిట్లను సొంతం చేసుకుంది. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. మెహ్రీన్ టాలీవుడ్ లో కనిపించి చాలా కాలం అయ్యింది. తెలుగులో చివరిగా ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకుంది మెహ్రీన్. ఆ తర్వాత బాలీవుడ్ లోకి చెక్కేసింది. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram