‘2018’ మూవీ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా.. స్టోరీ లైన్ వింటే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

నేటి తరం కుర్ర హీరోలకు మరియు స్టార్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి టాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ చిత్రాలలో ఒకటిగా నిలిపాడు మెగాస్టార్. సుమారుగా 140 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి

ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఇప్పుడు మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11 వ తారీఖున విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘భింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు, ఈ చిత్రం తర్వాత వెంటనే కళ్యాణ్ కృష్ణ తో మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు, ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న చిరంజీవి, రీసెంట్ గా మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గానే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన 2018 చిత్రం, మన టాలీవుడ్ లో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి జ్యుద్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ కి వచ్చి మెగాస్టార్ చిరంజీవి కి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అది చిరంజీవికి ఎంతో బాగా నచ్చడం తో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం.

- Advertisement -

ఇందులో చిరంజీవిని ఇప్పటి వరకు అభిమానులెవ్వరు చూడని కోణం లో చూపించబోతున్నాడట డైరెక్టర్. అయితే మన తెలుగు ఆడియన్స్ కి మలయాళం డైరెక్టర్స్ తీసే సినిమాలు నచ్చుతాయా ?, వీళ్ళు ఇక్కడి స్టార్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తియ్యగల్తారా? వంటి సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి జానర్ తో మన ముందుకు రాబోతున్నారు అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here