Chiranjeevi : ఆ హీరోయిన్ కోసం అన్నం తినడం మానేసిన మెగాస్టార్ చిరంజీవి!

- Advertisement -

Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో సువర్ణాక్షరాలతో లిఖించగలిగే చరిత్ర ఉన్న హీరోలలో ఒకడు మెగాస్టార్ చిరంజీవి. పెద్ద ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఏకైక హీరో ఆయన. తన జనరేషన్ హీరోలతో మాత్రమే కాకుండా, తన తర్వాతి జనరేషన్ హీరోలతో కూడా పోటీ పడే కసి ఇప్పటికీ ఆయనలో ఉంది. అందుకే నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేని అత్యధిక వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఆయనకు ఉన్నాయి.

Chiranjeevi
Chiranjeevi

ఏడు పదుల వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఆయన పడే కష్టం కోట్లాది మంది యువతకి ఆదర్శ ప్రాయం అనే చెప్పాలి. దెబ్బలు తగిలినా, ఆరోగ్యం బాగాలేకపోయిన షూటింగ్స్ లో పాల్గొనే తత్త్వం ఆయనది. పాత్ర కోసం ఏమి చెయ్యమన్నా చేసే స్వభావం ఆయన సొంతం. అందుకు ఉదాహరణగా రీసెంట్ గా ఆయన గురించి తెలిసిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chiranjeevi  Photos

మెగాస్టార్ చిరంజీవి తనకి ఉన్న మాస్ ఇమేజి మొత్తాన్ని పక్కన పెట్టి, ఆయన చేసిన చిత్రం శ్రీ మంజునాథ. చిరంజీవి సినిమా అంటే డ్యాన్స్, యాక్షన్, ఫైట్స్ ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. ఈ చిత్రం లో చిరంజీవి మహా శివుని క్యారక్టర్ ని చేసాడు. ఇక పార్వతీ దేవి పాత్రలో మీనా నటించింది. ఆమె ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు నాన్ వెజ్ ముట్టకూడదు అని ఒట్టు పెట్టుకుంది అట. చిరంజీవి మొదట్లో ఇలాంటి పట్టింపులు ఏమి ఉండేవి కాదు.

- Advertisement -
Sri Manjunadha

కానీ మీనా ఇలా చేసింది అని తెలిసి, ‘అవును కదా.. నేను దేవుడి క్యారక్టర్ చేస్తున్నాను.. నాన్ వెజ్ తింటే ఎలా’ అని అనుకోని నాన్ వెజ్ తినడం మానేసాడట. అప్పటి వరకు చిరంజీవి కి లంచ్ మరియు డిన్నర్ లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగేది కాదట. అలాంటి చిరంజీవి ఈ సినిమా కోసం పూర్తిగా పక్కన పెట్టేసాడంటే ఆయన నియమ నిష్ఠలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here