‘మళ్లీ పెళ్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. జనాలు ఒక్కసారైనా వస్తారా?

- Advertisement -

సినీ నటుడు నరేష్, పవిత్రల ప్రేమ గురించి ఇటీవల కాలంలో బాగా వైరల్ అయ్యిన విషయం తెలిసిందే.. ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.. జనాలు ఇదంతా నిజమే అని నమ్మారు.. వీరి ప్రేమ పెళ్లి, హనీమూన్ వరకు వెళ్ళింది.. చివరకు అదంతా ఉత్తుత్తి అంటూ.. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అంటూ తెల్చేశారు.. వీరిద్దరూ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటిస్తున్నారు.. పెళ్లి చేసుకుంటున్న జంటగా, టాలీవుడ్‌లో ఈ జోడి వార్తల్లోకెక్కింది. ఇక ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.. మొన్నీమధ్య రిలీజ్ అయిన పాట ఆకట్టుకోవడం మాట పక్కన పెడితే ఈ వయస్సులో మీకు అవసరమా అంటూ విమర్శలు అందుకుంది.. ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది..

మళ్లీ పెళ్లి
మళ్లీ పెళ్లి

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ ఎం.ఎస్.రాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. కాగా, ఈ సినిమా టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది.. ఈ సినిమా నరేష్ పర్సనల్ లైఫ్ ఆధారంగా కథను తెరకేక్కించారు.. దాంతో కొందరు సినీ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఈ సినిమాకు జనాలు వస్తారా, అసలు వచ్చినా సినిమాను ఎవరైనా చూస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది..

ఏది ఏమైనా ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చెయ్యనున్నారు.. వేసవి కానుకగా మే 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను రీల్‌పై చూపెడుతున్న ఈ జంట, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలను ప్రస్తావిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో సాగుతోంది.. ఈ ముదురు జంట చేస్తున్న ‘మళ్ళీ పెళ్లి‘ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వస్తారా? రారా? అంటూ కొందరు నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here