Prashanth Varma : ప్రశాంత్ వర్మకు రూ.300కోట్ల ఆఫర్ ఇచ్చిన ‘పుష్ప 2’ మేకర్స్

- Advertisement -

Prashanth Varma : ‘హనుమాన్’ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు యావత్ భారతదేశంలో మార్మోగిపోతుంది. ఈ సినిమా సక్సెస్ తో దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు ప్రశాంత్ వర్మ. సీక్వెల్ కంటే ముందే సినీ యూనివర్స్ లో మరో రెండు చిత్రాలకు సన్నాహాలు దాదాపు పూర్తి చేసాడు. సినీ నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి ఈ యూనివర్స్ లో మరో చిత్రం మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘జై హనుమాన్’ షూటింగ్ ఆలస్యం కానుండడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంకానుంది.

Prashanth Varma
Prashanth Varma

‘జై హనుమాన్’ చిత్రానికి ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు) మరో రెండు సినిమాలు విడుదలవుతాయి. వాటిలో ఒకటి ‘అధిర’ కాగా.. రెండవ చిత్రం ‘మహాకాళి’. సమాజంతో శక్తికి ఉన్న పవర్ గురించి చెప్పే సినిమా ఇది. ‘జై హనుమాన్‌’ సినిమా షూటింగ్‌ 2025లో మొదలవుతుందని ఇంతవరకూ అనుకున్నారు కానీ.. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీస్‌ సంస్థ ఆ మధ్య ఓ మెగా ప్రాజెక్ట్‌ను ఇచ్చిందని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మకు భారీ బడ్జెట్‌తో సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు అని, హిట్ కోసం తహతహలాడుతున్న నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’ సినిమాలో రణవీర్ సింగ్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద ఫర్హాన్ అక్తర్ చిత్రం ‘డాన్ 3’, సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘శక్తిమాన్’ ఉన్నాయి. అయితే రెండింటి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా నిర్ణయించబడలేదు.

- Advertisement -

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన కొత్త ఆఫీసు నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. హైదరాబాదులోని తన పాత ఆఫీసు సమీపంలోనే దీనిని తీసుకున్నారు. ప్రస్తుతం దాని మోడలింగ్ పనులు జరుగుతున్నాయి. ‘అధిర’, ‘మహాకాళి’ సినిమాల సన్నాహాలను ఖరారు చేయడంలో దాదాపు 25 మందితో కూడిన టీమ్ అహోరాత్రాలు శ్రమిస్తుంది. ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం సౌతిండియాలోని పెద్ద యాక్టర్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘హనుమాన్’ చిత్రం 2024 సంవత్సరంలో భారతీయ చలనచిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నుండి ప్రశాంత్ వర్మకు చాలా సినిమా కంపెనీల నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇన్ని ఆఫర్ల మధ్య మైత్రి మూవీస్ ప్రతిపాదనకు ప్రశాంత్ అంగీకరించినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో నటుడు రణవీర్ సింగ్ ప్రశాంత్ వర్మను కలిశాడు. ఈ ముగ్గురి కలయిక గురించి ‘పుష్ప 2’ చిత్రం విడుదల సమయంలో అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here