పూజా హెగ్డే ఉంటే సినిమా చేయనన్న మహేష్.. అందుకే అమ్మడిని తీసేశారా..

- Advertisement -

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హీరో మహేష్ బాబు ఇంతకుముందు రెండు సినిమాలు కలిసి చేశారు… అవే అతడు మరియు ఖలేజా. అతడు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఖలేజా సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి మరొక సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముచ్చటగా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా 2021లో మే నెలలో అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ చేసి రెండేళ్లు పూర్తయినా కూడా ఇప్పటికే ఈ సినిమా ఒక కొలిక్కి రాలేదు.

మహేష్
మహేష్

మరో మాటలు చెప్పాలంటే డైరెక్టర్ మరియు నిర్మాతకు తప్ప అసలు ఈ సినిమాకు సంబంధించి ఏం జరుగుతోందనేది ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి మొదలైంది కదా అనుకుంటే…. ఏదో ఒక కారణం వల్ల అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజులు షూటింగ్ జరిగిన తర్వాత, కథ బాగోలేదని, ఆ తర్వాత స్క్రిప్ట్ సరిగ్గా రాలేదని, ఇలా ఏదో ఒక కారణం వల్ల అసలు ఈ సినిమా పట్టాలెక్కడమే గగనం గా మారింది. గత కొద్ది నాలుగ ఈ షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా మహేష్ బాబు గాని, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా రూపుదిద్దుకుంటున్న తీరుపై సంతోషంగా లేరన్న విషయం తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు థమన్ ను దర్శక నిర్మాతలు తీసివేయడం జరిగిందట.

అలాగే ఐరన్ లెగ్ పూజా హెగ్డే ఉంటే తాను సినిమా చేయనని మహేష్ చెప్పారట. అందుకే ఆమెను తొలగించి శ్రీలీలను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ అవ్వబోతుందట. దానికి తగ్గట్టుగా సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చేంజెస్ జరుపుతున్నారు. జూలై నెల నుండి ఈ సినిమాకు ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ జరపబోతున్నారు. రాబోయే ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారుట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here