Mahesh Babu : మహేష్ 5 సెకన్ల యాడ్ కు 5 కోట్లు కాదట..! మరి ఆ వార్త..?

- Advertisement -

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది. మహేష్  సినిమాలే కాదు.. కమర్షియల్, బిజినెస్ పరంగా టాలీవుడ్ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఒక్కో యాడ్ చేయాలంటే దానికోసం కోటి రూపాయలు తెసుకున్తదని టాక్. అయితే ఇప్పుడు షోషల్ మీడియాలో మహేష్ బాబు పై ఊ న్యూస్ చక్కర్లు కొదుతుంది. అదే 5 సెకన్ల యాడ్. ఈ యాడ్  కోసం మహేష్ 5 కోట్లు తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన సంగతి తెలిసిందే. Phone Pay, Google Pay, Paytm వంటి అనేక UPI యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో PhonePay UPI మహేష్ బాబుతో జత కట్టింది. ఫోన్ పే ద్వారా డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తే, వచ్చిన డబ్బు.. హ్యాట్సాఫ్ గురూగారూ అంటూ మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది.

అయితే ఈ వాయిస్ ఐదు సెకను మాత్రమే ఉంటుంది. మహేష్ ఈ వాయిస్ కోసం ఫోన్ పే కంపెనీ 5 కోట్లు చెల్లించినట్లు వచ్చిన వార్తలు ‘షోషల్ మీడియాను షేక్ చేసాయి. అంటే సెకనుకు రూ. కోటి? ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఐదు సెకెండ్లకు రూ. 5 కోట్లా అంటూ నోర్లు ఎల్లబెట్టారు.  అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు మహేష్ బాబు టీమ్. ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు వ్యవహరిస్తున్నారు.అందుకు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న మాట నిజమే కానీ.. కేవలం 5 సెకన్ల వాయిస్ కోసం 5 కోట్లు తీసుకోలేదని మహేష్ బాబు టీమ్ స్పష్టం చేసింది. ఫోన్ పేకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందున అందులో భాగంగా కొన్ని యాడ్స్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. అది తప్పా.. వాయిస్ ఓవర్ కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్నది నిజం కాదని అంటున్నారు. అయితే.. యాడ్స్ విషయంలో మహేష్ తర్వాత ఏ హీరో అయినా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here