Kruthi Shetty : ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. కృతి శెట్టిని దర్శకుడు బుచ్చిబాబు వెండి తెరకు పరిచయం చేశారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా చేసి… మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
వరుసగా సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ పెంచుకుంది. నాని సినిమాలో శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. తర్వాత విడుదల అయిన బంగార్రాజు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమానే అమ్మడికి చివరి హిట్.. తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాపే. దీంతో కృతికి టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే కృతి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఇటీవలే కృతి హీరో శర్వానంద్ తో కలిసి మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎప్పటి మాదిరే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తాను టాలీవుడ్కు గుడ్ బై చెప్పబోతుందట. ఆమెకు తమిళంలో భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటికే మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్లు ప్లాపులు వస్తూనే ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కానీ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.