ఆ కుర్ర హీరోతో కృతి శెట్టి పెళ్లి ఫిక్స్.. అందుకే సినిమాలకు దూరం అయ్యిందా?

- Advertisement -

ఇటీవల ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ లో కేవలం ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు కృతి శెట్టి. బూచి బాబు దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి క్రేజ్ మామూలు రేంజ్ లో రాలేదు.

కృతి శెట్టి
కృతి శెట్టి

ముఖ్యంగా యూత్ మొత్తం ఆమె ఫ్యాన్స్ అయిపోయారు. కృతి శెట్టి అంటే ఒక యూత్ ఐకాన్ లాగ మారిపోయింది. ఆ సినిమా తర్వాత వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ లో పొరపాట్లు చెయ్యడం వల్ల వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.

దీంతో కృతి శెట్టి కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈమెతో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరూ సిద్ధం గా లేరు. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమె వైపు చూడడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఆమె సినిమాలకు చిన్నగా దూరం అవ్వడానికి అసలు కారణం మరొకటి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. అదేమిటంటే ఈమె ప్రముఖ యంగ్ హీరో తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతుంది అట.

- Advertisement -

వీళ్ళ విషయం ఇంట్లో కూడా తెలిసిపోయింది. కృతి శెట్టి ఇంట్లో వాళ్ళు, అలాగే ఆ కుర్ర హీరో ఇంట్లో వాళ్ళు కూడా ఈ వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారట. అందుకే ఈ అమ్మాయి సినిమాలను బాగా తగ్గించేసింది అంటున్నారు. ఇంతకీ ఆమె ప్రేమలో ఉన్న ఆ యంగ్ హీరో మరెవరో కాదు, ఉప్పెన హీరో పంజా వైష్ణవ్ తేజ్ అని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here