KGF Sequel Movies : ఐదు భాగాలుగా KGF సినిమా.. కానీ హీరో యశ్ కాదట..?

- Advertisement -

KGF Sequel Movies : కేజీయఫ్‌ .. కన్నడ ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినిమా తలెత్తి చూసేలా చేసిన మూవీ. ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేసి.. కన్నడ ఇండస్ట్రీ రేంజ్​ను పెంచిన చిత్రం. హీరో యశ్​ను పాన్ ఇండియా స్టార్​ను చేసిన సినిమా. అసలు కన్నడ సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటుందని తెలియని ప్రపంచానికి.. కన్నడ సినిమాల సత్తా ఏంటో చూపించిన మూవీ. టాలీవుడ్​లో బాహుబలికి ముందు.. ఆ తర్వాత అని ఎలా మాట్లాడుకుంటున్నారో.. శాండల్​వుడ్​లో కూడా బిఫోర్ కేజీయఫ్.. ఆఫ్టర్ కేజీయఫ్​ అని అంటున్నారు.

KGF Sequel Movies
KGF Sequel Movies

మొదటి భాగంతో బాక్సాఫీస్​ను షేక్ చేసిన కేజీఎఫ్.. రెండో భాగంతో రికార్డులు బద్ధలు కొట్టింది. ఇక ఈ సినిమాతో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన హొంబలే బ్యానర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో రాకింగ్​ స్టార్​ యశ్‌ పేరు ఒక బ్రాండ్‌లాగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1250కోట్లు వసూళ్లు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన కేజీఎఫ్-2 కనకవర్షాన్ని కురిపించింది. దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని దక్కించుకుంది.

అయితే తాజాగా కేజీయఫ్‌ అభిమానులకు హోంబాలే ఫిల్మ్స్‌ నిర్వాహకులు ఓ అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. అదేంటంటే ఇప్పటికే రెండు పార్టులు రిలీజైన ‘కేజీఎఫ్‌’ సినిమా ఇప్పుడు మొత్తం ఐదు భాగాల్లో తీస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఒక్కో సీక్వెల్లో ఒక్కో హీరో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో 2025లో ప్రారంభం కానున్న ‘కేజీయఫ్‌3’లో యశ్‌ కనిపిస్తారా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ సిరీస్​లోనూ యశ్​ ఉంటే బాగున్ను అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కేజీయఫ్‌-3 ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపైన హోంబలే ఫిల్స్మ్‌ అధినేత, నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సలార్‌’ పూర్తయ్యాక ‘కేజీయఫ్‌-3’పై నీల్‌ దృష్టి పెట్టనున్నారని విజయ్‌ కిరంగదూర్‌ చెప్పారు. సలార్‌ పూర్తయ్యాక.. కేజీయఫ్‌-3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్‌ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్‌ ఉందని, వచ్చే ఏడాది గానీ, ఆ మరుసటి ఏడాదిగానీ సాకారం కావొచ్చని చెప్పారు.

మరోవైపు, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ‘సలార్’కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు రాకీభాయ్​ యశ్‌ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్‌ నడుస్తోంది. దీని కోసం ప్రశాంత్‌నీల్‌ కేజీయఫ్‌ స్టార్‌ యశ్‌ను సంప్రదించారని.. యశ్‌ ఓకే చేశారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ, ఈ ఇద్దరు పాన్‌ ఇండియా హీరోలు ఒకే సినిమాలో మెరవనున్నారన్న వార్తను మాత్రం అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇది మాత్రం నిజమైతే అటు డార్లింగ్​ ఫ్యాన్స్ ఇటు రాకీభాయ్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటారు మరి.​

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here