Keerthy Suresh : పాపం కీర్తి సురేష్ దగ్గరకు అన్నీ అలాంటి కథలే వస్తున్నాయిట.. కలలో కూడా అనుకోలేదంటూ వాపోతుంది..

- Advertisement -

Keerthy Suresh ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తను చేసిన ప్రతి ప్రాజెక్టుకు జనాల నుంచి అపూర్వ స్పందన లభించింది. ‘దసరా’, ‘మామన్నన్‌’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వరుస హిట్ల నేపథ్యంలో కథల ఎంపికలో ఆలోచనలు మారుతుంటాయా? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను బట్టి కథల ఎంపికలో తరుచుగా ఆలోచనలు మారవని వెల్లడించింది కీర్తి సురేష్.

keerthy suresh
keerthy suresh

“ఒక హిట్టు దక్కితేనో, ఫ్లాప్‌ వచ్చిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. నేను ఎప్పుడైనా విభిన్న కథాంశాలతో కూడిన భిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేయాలని భావిస్తాను. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు పోషించాలి అనుకుంటాను. నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం. గత కొంత కాలంగా నా దగ్గరికి వస్తున్న కథలు, పాత్రలు అన్నీ నా ఊహలకు మించి ఉంటున్నాయి. నేను కలలో కూడా అనుకోని క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనే ఆలోచన తప్ప” అని కీర్తి సురేష్ అభిప్రాయపడింది.

Keerthi suresh Dazzling looks on netflix event
Keerthi suresh Dazzling looks on netflix event

కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నది. ఇక కీర్తి సురేష్ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ కొత్త వెబ్ సిరీస్ నిర్మిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here