నలుగురిలో ఉన్నప్పుడు అక్కడ అసభ్యంగా తాకాడు..బోరున ఏడ్చిన నటి కస్తూరి

- Advertisement -

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది కస్తూరి శంకర్‌. నాగార్జున అన్నమయ్య, బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం,రాజశేఖర్ మా ఆయన బంగారం, రథయాత్ర తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఇప్పుడు పలు టీవీ సీరియల్స్‌, షోల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలు, సీరియల్స్‌ సంగతి పక్కన పెడితే ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ఇటీవల ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా, ఇటీవల గిరిజన యువకుడిపై మూత్రం పోయడం వంటి సంఘటనలపై కస్తూరి చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి.

తాజాగా తనపై లైంగక దాడి జరిగిందంటూ సంచలన కామెంట్స్ చేసింది. ‘‘ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్‌ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు’ అని నటి కస్తూరి చెప్పింది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

నటి కస్తూరి

ఇక ఇలాంటివి కస్తూరికీ కొత్తేమి కాదనుకోండి.. గతంలోనూ నయనతార గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది ఈ నటి. నటీమణుల్లో లేడీ సూపర్‌ స్టార్‌ ఎవరు అని అడగ్గా.. ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో సూపర్‌ స్టార్‌గా చెప్పుకోదగ్గవారు ఎవరూ లేరని బదులిచ్చింది. అయితే, అలనాటి నటీమణులు కేపీ సుందరాంబల్‌, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది. నయన్‌కు తానో అభిమానిని అంటూనే.. ఆమెను లేడీ సూపర్‌ స్టార్‌ అనలేమంటూ వ్యాఖ్యానించింది. నయనతార నటించిన ‘మాయ’ (2015లో తమిళ్‌లో వచ్చిన హార్రర్‌ సినిమా) చిత్రం మాత్రమే ప్రాముఖ్యత కలిగిన కథగా చెప్పుకొచ్చింది. కస్తూరి కామెంట్స్‌ వైరల్‌ కావడంతో. అవి చూసిన నయన్‌ ఫ్యాన్స్‌ కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here