జైల‌ర్‌ సినిమాకు స్టార్ల రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే!

- Advertisement -

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అద్భుతహా అనిపించుకుంది. దీంతో ఎప్పుడు ఆగష్టు 10వస్తుందా సినిమా ఎప్పుడు చూడాలని రజనీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవబోతుంది. అన్నాత్తై తర్వాత సూపర్ స్టార్ రజనీ నుంచి రాబోతున్న సినిమా ఇది. గతంలో రజనీ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాలు నమోదు చేసుకోలేదు. దీంతో అందరూ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ప్రస్తుతం ట్రైలర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత రజనీకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. వారి కూతురిగా మిర్నా మీనన్ నటిస్తోంది. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సునీల్, జాకీ ష్రాఫ్, వినాయకన్, యోగిబాబు పలువురు పేరొందిన యాక్టర్లు నటిస్తున్నారు.

జైల‌ర్‌
జైల‌ర్‌

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో నటించినందుకు స్టార్లకు భారీగా రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. జైల‌ర్ సినిమా దాదాపు రూ. 225 కోట్లతో నిర్మించారు. సినిమా బడ్జెట్లో సగం స్టార్లకు రెమ్యునరేషన్ రూపంలో వెళ్లిపోయింది. వీరిలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంతే. ఆయ‌నకే ఏకంగా రూ.110 కోట్లు చెల్లించారట. అంతేకాకుండా మోహ‌ల్ లాల్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. 15సినిమాల పాటు ఉండే మోహన్ లాల్ పాత్రకు రూ.8కోట్లు ఇచ్చారట. అలాగే జాకీష్రాఫ్ కు రూ. 4 కోట్లు, శివరాజ్ కుమార్ కు రూ. 4 కోట్లు, త‌మ‌న్నాకు రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ కింద చెల్లించారట. అలాగే యాక్టర్ యోగిబాబుకు రూ. కోటి, రమ్యకృష్ణకు రూ.80లక్షలు, సునీల్ కు రూ. 60 ల‌క్ష‌లు ఇచ్చినట్లు నెట్టింట్లో ప్రచారం నడుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here