Puri Jagannadh : సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్న పూరీ జగన్నాథ్.. ఇక నుంచి ఆ పనే చేస్తాడట

- Advertisement -

Puri Jagannadh : దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తి. అతను చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లైగర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు దూసుకుపోతుండడంతో రేసులో కాస్త వెనుకబడ్డాడు. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు. పవన్ కళ్యాణ్ – రవితేజ లాంటి స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్ అన్న సంగతి మర్చిపోకూడదు. ఒక భద్రి.. ఒక ఇడియట్ .. ఒక అమ్మానాన్న తమిళ అమ్మాయి లాంటి సినిమాలను తెరకెకించిన పూరీ జగన్నాథ్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. నమ్మి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అవకాశం ఇవ్వలేకపోతున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంది.

- Advertisement -

పూరి జగన్నాథ్ డైరెక్షన్ కి టోటల్ గా గుడ్ బై చెప్పి నటన వైపు మళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా డబుల్ ఇస్మార్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా అయిపోగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా తెరకెక్కించేసిన వెంటనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి నటుడుగా కొత్త జీవితం ప్రారంభించాలని ట్రై చేస్తున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here