రాకేష్ మాస్టర్ పై విష ప్రయోగం జరిగిందా..? అందుకే చనిపోయాడా..? సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్లు!

- Advertisement -

జీవితం మన చేతుల్లో ఉండదు, ఎప్పుడు ఏ క్షణం లో ఏదైనా జరగొచ్చు కాబట్టి, ఈ క్షణం లో ఎంత సంతోషంగా జీవించవు అనేదే ముఖ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం రాకేష్ మాస్టర్. ఉన్నన్ని రోజులు ఈయన లాగా జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎల్లప్పుడూ సరదాగా గడుపుతూ నలుగురిని నవ్విస్తూ, బిందాస్ లైఫ్ ని గడిపాడు ఆయన.

రాకేష్ మాస్టర్
రాకేష్ మాస్టర్

వారం రోజులు క్రితం వరకు కూడా ఆయన ఎంత సంతోషం గా జీవించాడో, ఆయన యూట్యూబ్ ఛానల్ ని చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియా లో కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొని శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి అక్కడ ‘మ్యాన్షన్ హౌస్’ అనే స్పెషల్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసాడు. అగ్గిపెట్టె మచ్చ, సునిశిత్, స్వాతి నాయుడు తదితరులతో రాకేష్ మాస్టర్ చేసిన సందడిని చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాము.

Rakesh Master

అయితే రాకేష్ మాస్టర్ వయస్సుకి మించి తాగడం వల్ల ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడానికి కారణం అని అంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుంది, ఎండ 45 డిగ్రీలకు తక్కువ ఉండడం లేదు. ఈ ఎండని తట్టుకోలేక రాకేష్ మాస్టర్ విపరీతంగా శ్రీకాకుళం టూర్ లో తాగేశాడు.

- Advertisement -
Rakesh Master Dead

అది ఆయనకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది, దానికి తోడు ఏది పడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా అయ్యిందని, దానికి తోడు మద్యం కూడా మితిమీరి తాగడం తో రియాక్షన్ ఇచ్చి ఆయన చనిపోయాడు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది. దీనిపై రాకేష్ మాస్టర్ సన్నిహితులు స్పందిస్తూ, నిన్న రాత్రి ఆయనకి సన్ స్ట్రోక్ తగిలిందని, వెంటనే ఆయనని గాంధీ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించామని. డాక్టర్లు ఆయన ప్రాణాన్ని కాపాడేందుకు చాలా కష్టపడ్డారని, కానీ కాపాడలేకపొయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here