కమెడియన్ బాబు మోహన్ కారణంగా ఆగిపోయిన మెగాస్టార్ చిరంజీవి సినిమా అదేనా..?

- Advertisement -

టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవే లేదు, మన ఇండస్ట్రీ లో ఉన్నంత కమెడియన్స్ ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు అని అందరూ అంటూ ఉంటారు. అంత మంది కమెడియన్స్ మధ్యలో కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే లెజెండ్ స్థాయిని దక్కించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు బాబు మోహన్.

బాబు మోహన్
బాబు మోహన్

‘ఆహుతి’ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన బాబు మోహన్ ఆ తర్వాత జంధ్యాల గారు తెరకెక్కించిన ‘ఆహా నా పెళ్ళంటా’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపుని దక్కించుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని అంకుశం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏడాది కనీసం పది సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా మారిపోయాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ విజయం సాధించాడు.

అలా బాబూమోహన్ ఎన్ని సినిమాల్లో నటించినా ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలిచే చిత్రం ‘మాయలోడు’. రాజేంద్ర ప్రసాద్ మరియు ఎస్వీ కృష్ణ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమాలో బాబు మోహన్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా సౌందర్య తో కలిసి ఆయన వేసిన డ్యాన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఎందుకంటే ఆడియన్స్ బాబు మోహన్ నుండి డ్యాన్స్ కలలో కూడా ఊహించలేదు, అది కూడా సౌందర్య లాంటి టాప్ హీరోయిన్ సరసన.

- Advertisement -

ఈ చిత్రం విడుదలైన కొత్తల్లో తనకి ఎదురైనా మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాబు మోహన్ రీసెంట్ సమయం లో ఇచ్చిన ఇంటర్వ్యూ తెగ వైరల్ గా మారింది. ఈ సినిమా విడుదలైన రోజు చిరంజీవి గారు తన హోమ్ బ్యానర్ లో ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ చిత్రం విడుదలైంది అనే విషయం తెలుసుకున్న చిరంజీవి, ఆ రోజు షూటింగ్ ని ఆపేసి, నాగబాబు మరియు తన తండ్రి వెంకట్రావు తో కలిసి సినిమాని చూశారట. ఆ తర్వాత బాబు మోహన్ కి ఫోన్ చేసి డ్యాన్స్ చింపేశావయ్యా, అసలు ఊహించలేదు అని అన్నాడు. ఆ ప్రశంసని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here