ఆ ప్రశ్న అడిగిన నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రష్మీ

- Advertisement -

బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ కెరీర్ బిజీ బిజీగా కొనసాగిస్తోంది. బుల్లితెర, వెండితెరపై తన అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తెరపైనే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలోనే రష్మి నెటిజన్ల చేతుల్తో ట్రోల్స్ కు గురవుతుంది. ఇది ఇలా ఉంటే.. సనాతన ధర్మం విషయం దేశమంతా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉధ‌య‌నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడంతో రాజకీయ పార్టీల మధ్య రచ్చ జరుగుతోంది.

రష్మీ
రష్మీ

దీనిపై యాంకర్ రష్మీ కూడా స్పందించింది. సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా.. నువ్వేంటి నీ దుస్తులు ఏంటి ? నువ్వు సినిమాల్లో ఎలా కనిపిస్తున్నావు..? అని ఓ నెటిజ‌న్ ప్రశ్నించాడు. దానికి రష్మీ స్పందించింది. అది వృత్తిలో భాగం. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తామని రిప్లై ఇచ్చింది. దానికి మ‌రో నెటిజ‌న్.. నువ్వు ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకుంటావు సరే.. పెళ్లి అయిన తర్వాత నీ కొడుకు, కూతురు ఈ ఫోటోలు చూసి బాధపడితే ఏం చేస్తావ్..? వారి ఫ్రెండ్స్ ఏంటి మీ మమ్మీ ఇలా డ్రెస్ చేసుకుంది.. అని ట్రోల్‌ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం సమాధానం చెప్తావ్..? అని అడిగాడు. దానికి స్పందించిన రష్మీ.. ‘అది నాకు, నా పిల్లలకు సంబంధించిన విషయం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదుగా.. నీకేంటి నొప్పి..?’ అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం యాంకర్ రష్మి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here