‘భోళా శంకర్’ ఈవెంట్ లో రెచ్చిపోయిన హైపర్ ఆది.. ఈ కామెంట్స్ ఆర్జీవీ గురించేనా..

- Advertisement -

చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ గ్రాండ్‍గా జరిగింది. హైదరాబాద్‍లోని శిల్ప కళావేదికలో ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది. ‘తీన్‍మార్’ అనే రిలికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ ఈ ఈవెంట్‍లో లాంచ్ చేసింది. ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‍కు చిరంజీవి, కీర్తి సురేశ్‍, పలువురు నటులు, కొందరు దర్శకులు, టెక్నిషియన్లతో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‍లో కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ వైరల్‍గా మారింది. మెగా ఫ్యామిలీని విమర్శించే వారికి తన స్టైల్‍లో పంచ్‍లు వేశాడు ఆది. చిరంజీవి రికార్డుల గురించి వివరించాడు. ప్రశంసలు కురిపించాడు.

హైపర్ ఆది
హైపర్ ఆది

హైపర్ ఆది మాట్లాడుతూ… ‘‘ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు నేను సైనికుడిని అవుతా అని యుద్ధ భూమిలోకి దిగారు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ల యుద్దం చేస్తున్నారు. ఇక ఒక రోజు ఈయన యుద్ధం చేశారు. గెలిచారు. ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి. ఇంద్రాసేనాని. తమ్ముడేమో. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు’’ అని హైపర్ ఆది అన్నారు.

‘‘బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్. ఆస్తులు సంపాదించడం కన్నా. అభిమానులను సంపాదించారు. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో చెప్పలేం కానీ. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. హీరో ఉదయ్, హీరో సుమన్ విషయాల మీద తప్పుడు న్యూస్ రాసి. పాదించుకుంటున్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి సంపాదించుకోండి ఇలాకాదు. టాలీవుడ్ లోనే ఓ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. అలాగే మెగాస్టార్ ను, పవర్ స్టార్ ను అనే స్థాయి ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తుంటారు. వాళ్లకి చెబుతున్నాను. అర్థం లేని మాటలకు క్లాప్స్ రావు.. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని అనుకుంటున్నాను’’ అని రెచ్చిపోయాడు హైపర్ ఆది

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here