తెలుగు డైరెక్టర్స్ కామాంధులు అంటూ హీరోయిన్ ఇలియానా షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఇలియానా. ‘దేవదాస్’ అనే చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె తొలిసినిమాతోనే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఇలియానా కి తదుపరి చిత్రం నేరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇలియానా
ఇలియానా

ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమె వరుసగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగు తో పాటుగా తమిళం లో కూడా అదే రేంజ్ క్రేజ్ ని సంపాదించింది ఇలియానా. అయితే ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ పెద్ద సక్సెస్ లు రాక కెరీర్ లో డీలా పడింది.

ఇది ఇలా ఉండగా గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఇలియానా టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సెన్సేషనల్ గా మారింది. మీరు దాదాపుగా సౌత్ లో అందరి స్టార్ హీరోలతో నటించారు, ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు, కానీ నటన పరంగా మిమల్ని జనాలు గుర్తించుకునే పాత్ర ఇప్పటి వరకు పడలేదని ఇండస్ట్రీ లో చాలా మంది అనుకుంటున్నారు, దీనికి మీరిచ్చే సమాధానం ఏమిటి అని అడుగుతుంది.

- Advertisement -

దానికి ఇలియానా స్పందిస్తూ, నేను ఎలాంటి పాత్ర ని అయినా పోషించగలను, కానీ తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా నాలోని నటన కంటే, నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు, వాళ్లకి ఎప్పుడూ నా నడుము మీదనే ద్రుష్టి అంటూ కామెంట్స్ చేసి సంచలనం రేపింది. గతం లో రాశి ఖన్నా, పూజ హెగ్డే వంటి వారు కూడా ఇలాంటి కామెంట్స్ చేసి దుమారం రేపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here