మరోసారి వాయిదా పడ్డ ‘గుంటూరు కారం’..ఇదంతా పవన్ కళ్యాణ్ కోసమేనా!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’. ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఏ ముహూర్తం లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారో కానీ, అప్పటి నుండి అన్నీ బ్రేకులే. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కేవలం పది శాతం షూటింగ్ ని మాత్రమే పూర్తి చేసుకుందట.

గుంటూరు కారం
గుంటూరు కారం

మొన్న టీజర్ లో చూపించిన షాట్స్ మొత్తం ఆ పది శాతం షూటింగ్ కి సంబంధించిన ఔట్పుట్ అట. ఆ సన్నివేశం మరియు హీరోయిన్స్ తో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారట.ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu

కానీ మహేష్ బాబు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీ తో కలిసి సమ్మర్ టూర్ కి వెళ్ళాడు. జూన్ 2 వ తారీఖున తిరిగి వస్తాడు, అప్పటి నుండి సరికొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. కానీ ఈ షెడ్యూల్ మరో సారి వాయిదా పడింది. కనీసం 10వ తేదీన అయినా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ అవ్వలేదు, ఈ నెల లో ఈ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశమే లేనట్టుగా తెలుస్తుంది.

- Advertisement -
Mahesh Babu GUntur karram

ఇంత స్లో గా షూటింగ్ సాగితే సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశమే లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఆలస్యానికి కొంతమంది మహేష్ బాబు ని తప్పుబడుతుంటే, మరికొంత మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తప్పుబడుతున్నారు. తన మిత్రుడు పవన్ కళ్యాణ్ సినిమాల స్క్రిప్ట్స్ పై శ్రద్ద పెడుతూ మా సినిమాని పక్కన పెట్టేసాడని త్రివిక్రమ్ ని మహేష్ ఫ్యాన్స్ తిడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here