Prabhas : హీరోల మధ్య పెద్ద వివాదం.. గోపీచంద్ ముక్కు పగలగొట్టిన ప్రభాస్

- Advertisement -

Prabhas : ప్రభాస్‌, గోపీచంద్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ఇద్దరు కలిసి `వర్షం` సినిమాలో కూడా నటించారు. దీంతో వారి స్నేహం మరింత బలపడింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది. ది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఈ ఇద్దరు రాణిస్తున్నారు. త్వరలో వారిద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలనే ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య జరిగిన గొడవని బయటపెట్టారు ప్రభాస్‌. ఓ రోజు గోపీచంద్‌ని ప్రభాస్ తీవ్రంగా కొట్టాడట. అలా కొడితే గోపీచంద్ ముక్కు పగిలిందట.

ఇంతకీ ఇద్దరి మధ్య గొడవేంటంటే.. ప్రభాస్‌.. గోపీచంద్‌ వ్యక్తిత్వం గురించి బాలయ్యకి చెప్పారు. గోపీచంద్‌కి చాలా ఓపిక. ఏమాత్రం చిరాకు పడడని తెలిపాడు ప్రభాస్. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన విషయం బయటపెట్టాడు. ఓ సారి షూటింగ్‌లో గోపీచంద్‌కి గాయమైందట. ప్రభాస్‌కి నవ్వితే మనుషులను నెట్టే అలవాటు ఉందట. అలా ప్రభాస్ గోపీచంద్‌ని తరచూ నెట్టుతుండటం, కొట్టడం చేస్తుంటాడట. అయితే ఆ రోజు అప్పటికే గోపీచంద్‌ ముక్కు పగిలిందట. దీంతో ముందే చెప్పాడట. అరేయ్‌ ఈ రోజు నవ్వితే కొట్టొద్దు జాగ్రత్తగా ఉండమని చెప్పాడట. కానీ ప్రభాస్ ఆ విషయం మర్చిపోయాడట. కారులో వెళ్తున్న క్రమంలో ఏదో జోక్‌ వస్తే ఇద్దరు తెగనవ్వుకున్నారు. ఆ జోష్‌లో గోపీచంద్‌ని కొట్టాడట ప్రభాస్. దెబ్బకి ముక్కు నుంచి రక్తం కారిందట. అయినా గోపీచంద్‌ చిరాకు పడలేదట. ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ `అరేయ్‌ ఏంట్రా ఇది, కొంచెం చూసుకోరా` అని చిన్నగానే అన్నాడట. పాపం మంచోడు సర్‌, చిరాకు రాదు సర్‌ అని బాలయ్యకి అసలు మేటర్ చెప్పాడు ప్రభాస్.

- Advertisement -

బాలయ్య హోస్ట్ గా, అన్‌స్టాపబుల్‌ షో వచ్చిన విషయం తెలిసిందే. రెండో సీజన్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ కలిసి పాల్గొన్నారు. ఇందులో అసలు విషయం చెప్పాడు ప్రభాస్. గోపీచంద్‌ గొప్ప మనసుని, తమ మధ్య బాండింగ్‌ని వెల్లడించారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులని తెగ ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ కొడుకు అని హీరో గోపీచంద్‌ `తొలి వలపు`చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో విలన్‌గా `జయం`, `నిజం`, `వర్షం` చిత్రాలు చేశాడు. దర్శకుడు తేజ సినిమాల్లో విలన్‌గా మెప్పించారు. `వర్షం` తర్వాత హీరోగా మారాడు. `యజ్ఞం` చిత్రంతో హీరోగా హిట్‌ కొట్టాడు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `విశ్వం`అని టైటిల్ అనుకుంటున్నారు ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `కల్కి2898ఏడీ`, `ది రాజా సాబ్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here