Geethu Royal : నాగార్జున ఆ విషయంలో పనికిరాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన గీతు రాయల్..

- Advertisement -

Geethu Royal : తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏడు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ముగిసిన 7వ సీజన్ గురించి ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అన్ని సీజన్స్‌లో 7వ సీజన్‌కే ఎక్కువ పాపులారిటీ లభించిందని మేకర్స్ అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఎప్పటికప్పుడు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేయడం కోసం బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్.

ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా గీతూ వ్యవహరించింది. హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను, వారు మాట్లాడిన మాటలను వారికే గుర్తుచేసి మరీ ప్రశ్నలతో చెమటలు పట్టించేది. ఇక బిగ్ బాస్ బజ్ పూర్తయిపోవడంతో గీతూ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసింది. గీతూ పాల్గొన్న ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. ముందుగా హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నాగార్జునకు హోస్ట్‌గా ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ వస్తుందేమో అని సందేహం వ్యక్తం చేసింది.

‘‘నాగార్జున సీజన్ 4 లేదా 5లోనో హోస్ట్‌గా ఫెయిల్ అయ్యారనేది నా అభిప్రాయం. అప్పటివరకు ఆయనకు స్క్రిప్ట్ వస్తుందనే విషయం నాకు తెలీదు. నేను ఉన్న సీజన్‌లో అదే జరిగింది. నాకు, చంటికి జరిగిన గొడవలో నా తప్పు ఏం లేదు. కానీ నాగార్జున మాత్రం నాదే తప్పు అన్నట్టుగా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అదంతా స్క్రిప్ట్ అయ్యి ఉండచ్చు.. నాకు తెలీదు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గీతూ. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ చేసేది స్క్రిప్ట్ అని ప్రేక్షకుల్లో అనుమానం ఉన్నా.. నాగార్జున కూడా స్క్రిప్ట్‌ను ఫాలో అయ్యి జడ్జ్‌మెంట్స్ ఇస్తారని ఇప్పటివరకు చాలామందికి తెలియదు. గీతూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here