స్టార్‌ హీరోపై కంగానా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు.. అందరి ముందే అలా తిట్టేసింది!

- Advertisement -

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగానా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించింది.
నెపోటిజంతో పాటు ఏ విషయంపైనైనా సూటిగా మాట్లాడే ఆమె ఎంతటి స్టార్‌ మీదనైనా విమర్శలు చేయడానికి వెనుకాడదు. దేశ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది.

కంగానా రనౌత్‌
కంగానా రనౌత్‌

సినిమాలలో బిజీగా ఉన్నా.. దేశంలోని పలు అంశాల పైన ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలపై పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈమె ధాటికి కంగన ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ ఆధిపత్యం తీసుకున్న తర్వాత ఇటీవలే ఆమె ట్విట్టర్‌ ఖాతా పునరుద్ధరించారు. ఇక తాజాగా కంగన మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచారు. ఏకంగా స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌నే టార్గెట్‌ చేస్తూ నెట్టింట విమర్శలు గుప్పించింది.

రణ్ బీర్ ని సన్నగా ఉండే తెల్లని ఎలుక అని సెటైర్ వేసింది. తదుపరి రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత కంగనా రనౌత్ ఇలా ఫైర్‌ అయింది. నితేష్ తివారీ రామాయణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్- ఆలియా జంట శ్రీరాముడు- సీతా దేవిగా నటిస్తారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలోనే కంగన ఈ కాస్టింగ్ సెలక్షన్ పై విరుచుకుపడింది.

- Advertisement -

ఇటీవల బొల్లి రామాయణం గురించి మరొక వార్త వింటున్నాను. ఇందులో ఒక తెల్లటి ఎలుక (రణబీర్ కపూర్‌ని ఉద్దేశిస్తూ) నటిస్తుందట. అతను దాదాపు ప్రతి ఒక్కరి గురించి అసహ్యకరమైన ప్రచారం చేస్తూ అపఖ్యాతి పాలయ్యాడు. పరిశ్రమలో స్త్రీలింగత్వం .. మాదకద్రవ్యాల వ్యసనంతో పాపులరైన వాడు. తనని తాను శివుడిని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు రాముడు కావాలనే అభిరుచి పెరిగింది.. అంటూ రణబీర్ ని పరోక్షంగా విమర్శించింది. బ్రహ్మాస్త్రలో రణబీర్ శివ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here