పుష్ప 2 ఆర్టిస్టులకు ఘోర ప్రమాదం..మధ్యలోనే నిలిచిపోయిన షూటింగ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్ ‘ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేడు షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్న పుష్ప 2 జూనియర్ ఆర్టిస్టుల బస్సుని, నార్కెట్ పల్లి వద్ద ఒక ప్రైవేట్ బస్సు డీ కొట్టింది. ఈ ప్రమాదం లో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

ప్రమాదం జరిగింది హైదరాబాద్ – విజయవాడ హై వే సమీపం లో కాగా , ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న మూవీ యూనిట్ వెంటనే షూటింగ్ నేడు క్యాన్సిల్ చేసి, హాస్పిటల్ కి తరలి వెళ్లారు. అక్కడ డాక్టర్లను ఆర్టిస్టుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి విచారణ జరపగా, ఎలాంటి ప్రమాదం లేదని, త్వరలోనే అందరు కోలుకుంటారని చెప్పడం తో మూవీ యూనిట్ కాస్త కుదుటపడింది.

ఇక ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంత ఆతృతగా చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన గ్లిమ్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి మరియు KGF సిరీస్ తర్వాత విడుదలైన ప్రతీ భాషలో బంపర్ హిట్ గా నిల్చిన చిత్రం పుష్ప.

- Advertisement -

ఆ క్యారక్టర్ అంటే నార్త్ ఇండియన్స్ కి పిచ్చి. ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసినప్పుడే, ఈ చిత్రాన్ని సరైన సమయం లో దింపితే బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డ్స్ గల్లంతు అని ట్రేడ్ పండితులు ఫిక్స్ అయిపోయారు. కేవలం ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రం నుండి రాబోతున్న ప్రమోషనల్ కంటెంట్ ఇక ఏ రేంజ్ హైప్ ని పెంచుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here