ఆ సమయంలో భయంతో చెమటలు పట్టాయి.. అప్పటి విషయం బయటపెట్టిన ఉదయభాను

- Advertisement -

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో యాంకర్ అనగానే గర్తుకువచ్చే పేర్లలో ముఖ్యంగా ఉదయభాను ఉంటారు. అంతలా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. బుల్లితెరపై తెలుగులో యాంకర్ అంటే ఇలానే ఉండాలి అనే చెప్పే రేంజ్ కు వెళ్లింది ఈ ఉదయభాను. ఈమె దాదాపు 15 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగింది. ఈమె ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. బుల్లితెరపై ఆమె తెచ్చుకున్న ఫేమ్ కారణంగా వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

ఉదయభాను
ఉదయభాను

ఇలా వెండితెరపై, బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉదయభాను గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆమె కెరీర్ కు సంబంధించి షాకింగ్ కామెంట్లు చేశారు. తన కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. చిన్నతనం నుంచే తనపై ఎక్కువగా బరువు బాధ్యతలు పెరిగాయని చెప్పుకొచ్చింది. తన తల్లి తనకు డ్యాన్స్ నేర్పించడంతో ఎన్నో స్టేజ్ కార్యక్రమాల్లో డ్యాన్స్ వేశానని.. ఆ ఫేమ్ తో చాలామంది సినిమాల్లో ప్రయత్నించొచ్చు కదా అని తెలిసినవాళ్లు చెప్పారన్నారు.

వాళ్లు చెప్పిన ఆ ఆలోచన కారణంగానే తనను బుల్లితెర వైపు అడుగుగు వేయించిందన్నారు. అలా అందరి ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె యాంకరింగ్ మొదలు పెట్టడానికి ముందు సినిమాల్లో నటించినట్లు చెప్పారు. ఎర్రసైన్యం సినిమాలో తాను నటించినట్లు చెప్పారు. ఆ సమయంలో తాను పొడువుగా ఉండేదాన్ని అని.. ఆ సమయంలో తన వయస్సు చాలా చిన్నది అని గుర్తు చేశారు. ఆ టైంలో దర్శకుడు డైలాగ్ లు చెప్పమంటే.. భయంతో చెమటలు పట్టి బట్టలు మొత్తం తడిసిపోయాయని.. ఈ సందర్భంగా ఉదయభాను అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఎంత భయపడినా.. తాను డైలాగ్ లను పూర్తి చేశానని.. ఆ సినిమాకు తనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని చెప్పారు ఉదయభాను.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here