అరుంధతి నాయర్ అందరికీ సుపరిచితమే. రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న విషయం కూడా మనకు తెలుసు మార్చి 14న ఇంటర్వ్యూకి హాజరైన ఆమె తన సోదరుడు తో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కారు వేగంగా వచ్చి స్కూటీ ని ఢీ కొట్టింది దీంతో ఆమె గాయాలు పాలయింది. తన సోదరుడు కూడా గాయాలు పాలయ్యారు. గత కొద్ది రోజులుగా అరుంధతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ఎవరైనా సహాయం చేస్తే కానీ బతికి బయటపడలేదు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ ద్వారా పలుమార్లు వేడుకున్నారు. బ్యాంకు వివరాలను సైతం తన ఇంస్టాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది త్రివేండ్రం లోని అనంతపురి హాస్పిటల్ లో అరుంధతి చికిత్స జరుగుతుందని ఆమె సోదరీ ఆర్తి చెప్పారు. వెంటిలేటర్ సహాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పారు వైద్యం కోసం దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని అరుంధతి కోసం 40 లక్షల ఆసుపత్రి బిల్లులు చెల్లించామని ఆర్తి చెప్పారు.
ఆమె తలకి అలానే వెన్నెముకకి తీవ్ర గాయాలు అయ్యాయి మెదడులో రక్తం గడ్డ కట్టిందని అందుకు సంబంధించి బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తయినట్లు చెప్పారు వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు 40 రోజులు దాటిన తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనేది క్లారిటీగా చెప్పలేము అని వైద్యులు అన్నట్లుsocial media
viral ఆర్తి అన్నారు.