Eesha Rebba : పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. ఈషారెబ్బ షాకింగ్ కామెంట్స్.. తండ్రి ఎవరో తెలుసా..?

- Advertisement -

Eesha Rebba టాలీవుడ్​లో తెలుగు హీరోయిన్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇక వారిలో అవకాశాలు.. విజయాలు అందుకున్న వారు చాలా తక్కువే. అలాంటి వారిలో ఒకరు ఈషా రెబ్బా. ఈ తెలుగందం.. కెరీర్​ స్టార్టింగ్​లో మంచి విజయాలు అందుకుంది. వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అవేం ఈ బ్యూటీకి పెద్దగా సక్సెస్​ను అందించలేకపోయాయి. ఏళ్ల తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఈషాకు చెప్పుకోదగ్గ ఒక్క పాత్ర లేదు. బ్లాక్​బస్టర్ అనిపించుకున్న ఒక్క సినిమా కూడా లేదు. అయినా నిరాశ చెందకుండూ ఈ డస్కీ బ్యూటీ తన అందం.. అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

Eesha Rebba
Eesha Rebba

తాజాగా ఈషా రెబ్బా మాయాబజార్ అనే వెబ్ సిరీస్​తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ సిరీస్​ ప్రమోషన్స్​లోనే బిజీగా ఉంది. మాయాబజార్ సిరీస్ ప్రమోషన్స్​లో భాగంగా ఈషా ‘సుమ అడ్డా’ షోలో తన టీమ్​తో సందడి చేసింది. ఈ షోలో భాగంగా సుమ.. ‘తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది’ అని ఈషా రెబ్బాను ప్రశ్నించగా.. దానికి ఈషా.. బజర్‌ నొక్కుతూ.. ‘తొందరపడినప్పుడు’ అంటూ క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత మీ ప్రేమ గురించి చెప్పండి అని సుమ అడగగా.. ఈషా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈషా ఇచ్చిన సమాధానంతో అటు సుమతో పాటు.. ఇటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ సమాధానం ఏంటంటే..?

తనకు ఇద్దరు పిల్లలున్నారంటూ ఈషా తన సమాధానంతో అందరికీ షాక్ ఇచ్చింది. ఈషా చెప్పిన సమాధానానికి సుమతో పాటు అక్కడి వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సుమ.. వాళ్ల నాన్న ఎక్కడుంటారు అని తిరిగి మరో ప్రశ్న అడిగింది. దీనికి ఈషా రెబ్బా ఏం సమాధానం చెప్పిందనేది తెలియాలంటే.. ‘సుమ అడ్డా’ షోకి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఎపిసోడ్​ ఈ నెల 22న ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈషా కామెంట్స్ సోషల్ మీడియాలోనూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాక్ ఆఫ్ ది టౌన్​గా మారాయి.

- Advertisement -

ఇక ఈషా రెబ్బా సినిమాల సంగతికి వస్తే.. ‘అంతకు ముందు ఆ తర్వాత’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా.. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమితుమీ’ చిత్రాలతో విజయాలు అందుకుంది. ఆ తర్వాత ‘దర్శకుడు’, ‘అ’, ‘బ్రాండ్‌ బాబు’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల24 గంటల్లో’ చిత్రాలు నటించి అలరించింది. టాలీవుడ్​లో అవకాశాలు రాక కొంత గ్యాప్ రావడంతో ఈ బ్యూటీ తమిళ, మలయాళ ఇండస్ట్రీలో తన ఫేట్ ఎలా ఉంటుందోనని ఆవైపుగా వెళ్లింది.

అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేసింది. ఆ తర్వాత అక్కడా పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ప్రస్తుతం డిజిటల్ మీడియాపై ఫోకస్ చేసింది. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్​లతో అలరిస్తోంది. ఆ మధ్య ‘3 రోజెస్‌’, ‘పిట్టకథలు’ సిరీస్​లతో ప్రేక్షకులను ఫిదా చేసింది. తాజాగా ఈషా రెబ్బా మాయాబజార్ అనే వెబ్ సిరీస్​తో ప్రేక్షకులను పలకరించింది. ఇక త్వరలోనే దయ అనే వెబ్ సిరీస్​తో మరోసారి అభిమానులను తన మాయలో పడేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్యూటీ సుధీర్‌బాబుతో ‘మామ మశ్చింద్ర’ చిత్రంలో నటిస్తుంది. తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here